థాయ్ లాండ్‌ నుంచి తిరిగి వచ్చిన యంగ్‌ టైగర్‌!

యంగ్‌ టైగర్‌ తారక్‌ తాజా చిత్రం దేవర..పార్ట్‌ 1. ఈ సినిమాలో రొమాంటిక్ సాంగ్‌ ను చిత్రీకరించేందుకు చిత్ర బృందం థాయ్‌ లాండ్‌ కు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే  సోమవారం జూనియర్ ఎన్టీఆర్,  తారక్ కుటుంబ సభ్యులు షూటింగ్ నుండి తిరిగివస్తూ, హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

తారక్‌ ఇక కొంత గ్యాప్‌ తర్వాత,  దేవర చిత్రీకరణలో మళ్లీ బిజీ అవ్వనున్నాడు. దేవర సినిమా సెప్టెంబర్ 27, 2024న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్ గా చేస్తున్నాడు. మొత్తానికి దేవర సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. 

Related Posts

Comments

spot_img

Recent Stories