సాయి పల్లవి ఎందుకు రాలేదంటే! టాలీవుడ్లో తెరకెక్కిన క్రేజీ మూవీస్ లో తండేల్ కూడా ఓ సినిమా. ఈ సినిమాకి యంగ్ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వం వహించగా పూర్తి లవ్ స్టోరీ మూవీగా ఈ మూవీ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రెడీ అయ్యింది.
ఇక ఈ సినిమాలో అక్కినేని నాగచైతన్య, అందాల భామ సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తుండటంతో ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తుండటంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో బజ్ క్రియేట్ చేసేందుకు పలు భాషల్లో ఈ మూవీ ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు.
అయితే, తాజాగా బాలీవుడ్లో ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా హిందీ ట్రైలర్ను అమీర్ ఖాన్ లాంచ్ చేశారు. కానీ, ఈ ఈవెంట్కు సాయి పల్లవి హాజరు కాలేదు. దీంతో ఈ ఈవెంట్కి ఆమె ఎందుకు రాలేదా అనే ఆసక్తి అందరిలో ఏర్పడింది. అయితే, సాయి పల్లవికి తీవ్ర జ్వరం రావడంతో ఆమె ఈ కార్యక్రమానికి హాజరుకాలేదని.. డాక్టర్లు ఆమెను పూర్తిగా రెస్ట్ తీసుకోవాల్సిందిగా సూచించినట్లు తెలుస్తుంది. దీంతో ఆమె ఆరోగ్యంపై అభిమానులు ఆరా తీస్తున్నారు. ఇక ఈ సినిమాలో సాయి పల్లవి పాత్ర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ చెబుతోంది.