పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పెద్ద బడ్జెట్ పీరియాడిక్ సినిమా “హరిహర వీరమల్లు” పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, బాబీ డియోల్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాకు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తుండగా, జ్యోతి కృష్ణ కూడా దర్శకత్వలో భాగం అయ్యారు.
పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఇదంతా కొత్తగా చేయబోతున్న ప్రాజెక్ట్ కావడంతో మొదటి నుంచి ఫ్యాన్స్ లో ఆసక్తి ఎక్కువే ఉంది. కానీ సినిమా మాత్రం ఎన్నో కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. మొదట అనుకున్నప్పుడు ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సి ఉండగా, ఇప్పుడు ఐదేళ్ల గ్యాప్ అయ్యింది. ఈ మధ్యే మేకర్స్ సినిమా రిలీజ్ డేట్ ను ఖరారు చేశారు.
అయినా ఇప్పటివరకు ఒక మంచి ప్రమోషనల్ ట్రీట్మెంట్ ఇవ్వకపోవడం అభిమానులను కూడా కాస్త నిరాశపెడుతోంది. ఇంకా పది పదకొండు రోజుల్లో సినిమా థియేటర్లలోకి రానుంది కానీ ఒక ట్రైలర్ కూడా రిలీజ్ చేయకపోవడం ఆడియెన్స్ లో ఆసక్తి తగ్గించేలా మారుతుంది. ఫ్యాన్స్ అయితే మాకే సరిపోతుంది అనుకుంటున్నా, సాధారణ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ట్రైలర్ రిలీజ్ చేయడం తప్పనిసరి. మరి మేకర్స్ ఈ దిశగా ఎప్పుడు అడుగులు వేస్తారో చూడాలి.