ఏమైంది బాస్‌!

ఏమైంది బాస్‌! యంగ్‌ డైరెక్టర్‌ క్రిష్, స్టార్‌ హీరోయిన్‌ అనుష్క ప్రధాన పాత్రలో ‘ఘాటీ’ అనే ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాని తీర్చిదిద్దుతున్నాడు. ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్ 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే, ఈ సినిమా విడుదలకి ఇంకా ఒక్క నెల మాత్రమే ఉంది. కానీ, మేకర్స్ మాత్రం ఇంకా ప్రమోషన్స్ ను మొదలుపెట్టలేదు. 

ఒక్క టీజర్ విడుదల తప్ప, మరే ఏ ప్రచార కార్యక్రమాలను స్టార్ట్ చేయలేదు. దీంతో ఈ సినిమా వాయిదా పడుతుందనే ఊహాగానాలు అభిమానులలో చెలరేగాయి. దానికి తగ్గట్టుగానే ఘాటీ సినిమా రిలీజ్ ఆలస్యం కావచ్చని తెలుస్తోంది. కాకపోతే, ఘాటీ మేకర్స్ నుంచి విడుదల వాయిదా పై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వచ్చిన దాఖలాలు లేవు. 

కాగా ప్రస్తుతం అనుష్క మలయాళంలో ఓ సినిమా లో నటిస్తుంది. ఆ సినిమాతో పాటు ఘాటీ సినిమాలో మాత్రమే అనుష్క యాక్ట్‌ చేస్తుంది. ఇక ఈ చిత్రం థియేటర్ లో విడుదలైన తర్వాత ఘాటీ అమెజాన్ లోకి విడుదల కాబోతుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories