టాలీవుడ్లో తనదైన క్లాసిక్ టచ్తో గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ శేఖర్ కమ్ముల తీసిన ముఖ్యమైన సినిమాలలో ఒకటి “లీడర్”. రానా దగ్గుబాటిని హీరోగా పరిచయం చేసిన ఈ పొలిటికల్ డ్రామా అప్పట్లో అంతగా కమర్షియల్ సక్సెస్ అందుకోలేకపోయినప్పటికీ, అందులో చూపిన రాజకీయ విలువలు, కథన శైలి మాత్రం చాలామందికి గుర్తుండిపోయాయి.
ఈ సినిమా విడుదలై చాలా ఏళ్లు అయినా ఇప్పటికీ దీనికి సీక్వెల్ రాబోతుందా అనే ఆసక్తి మాత్రం తగ్గలేదు. ఇప్పుడు లీడర్ 2 గురించి కొన్ని కీలక విషయాలు బయటకు వచ్చాయి. శేఖర్ కమ్ముల తాజాగా స్పందిస్తూ, ఈ ప్రాజెక్ట్ పట్ల తాను ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటానని చెప్పారు. లీడర్ కథను మొదట తీసినప్పటి సమయం, ఇప్పటి పరిస్థితులు చాలా భిన్నంగా మారిపోయాయని, ఆ మార్పుల్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారట.
ఇప్పుడు ప్రజల ఆలోచనా ధోరణి కూడా పూర్తిగా మారిపోయిందని, అలాంటి సమయంలో సెకండ్ పార్ట్ చేయాలంటే అది ఇప్పటి జనరేషన్కి కనెక్ట్ అయ్యేలా ఉండాల్సిందని అంటున్నారు. దీంతో లీడర్ 2 చేసే ఆలోచన మాత్రం ఆయనలో నిలకడగా కొనసాగుతోంది. అయితే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్లుతుంది అనే విషయం మాత్రం ఇంకా ఖచ్చితంగా తెలియాల్సి ఉంది.
ఇంకా ప్రస్తుతం శేఖర్ కమ్ముల తన లేటెస్ట్ సినిమా ‘కుబేర’ విడుదల దశలో ఉంది. ఆ ప్రాజెక్ట్ పూర్తి అయిన తర్వాతే ఆయన తదుపరి సినిమాల మీద ఫోకస్ పెడతారని అర్థమవుతోంది. మొత్తంగా లీడర్ 2 పై ఆశలు పెట్టుకున్నవారికి ఇది ఒక మంచి అప్డేట్ అని చెప్పొచ్చు.