హరిహరవీరమల్లు గురించి తాజా అప్డేట్‌ ఏంటంటే!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా యంగ్ హీరోయిన్ నిధి అగర్వాల్ కథానాయిక గా దర్శకుడు జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్న తాజా భారీ పాన్ ఇండియా సినిమా  “హరిహర వీరమల్లు” గురించి అందరికీ తెలిసిందే. మరి పవన్ నుంచి మొదలైన మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా ఈ సినిమానే. కాగా ఈ మూవీలో పవన్ కళ్యాణ్ మొదటిసారి ఒక వారియర్ రోల్ లో యాక్ట్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమా నిర్మాత ఏ ఎం రత్నం పవన్ కళ్యాణ్ ని రీసెంట్ గానే కలవడం… షూటింగ్ కూడా అతి త్వరలోనే మొదలు పెడతామని సెప్టెంబర్ 23 నుంచి జాయిన్ కాబోతున్నట్టు ఓ పెద్ద అప్డేట్ ని ఫ్యాన్స్ కి అందించారు. అయితే ఈ సినిమా షూటింగ్ ఇంకా కొన్ని రోజులు మాత్రమే పూర్తి కావాల్సి ఉంది. మరి ఇది పూర్తి చేసుకొనే ఈ ఏడాదిలోనే విడుదలకు  వస్తుందా లేక వచ్చే ఏడాదికి వెళుతుందా అనేది మాత్రం వేచి చూడాల్సిందే.

Related Posts

Comments

spot_img

Recent Stories