అతిలోక సుందరి ఇంట్లో గడపాలనుకుంటున్నారా?

బాలీవుడ్ తో పాటు.. టాలీవుడ్‌ , అన్ని ఇండస్ట్రీల వారికి అదిరిపోయే న్యూస్‌. ఎందుకంటే అతిలోక సుందరి శ్రీదేవి నివసించిన మొదటి ఇంట్లో సామాన్యులు కూడా గడిపేందుకు అవకాశం కలిపిస్తున్నారు.  శ్రీదేవి బోని  కపూర్‌ని పెళ్లి చేసుకున్న తర్వాత కొనుగోలు చేసిన ఆమె మొదటి ఇంట్లో గడిపే అవకాశం ఇస్తున్నారు. నిజానికి జాన్వీకి ఈ ఇల్లు చాలా ప్రత్యేకమైనది. ఆమె తన బాల్యాన్ని ఇక్కడే గడిపింది. నేషనల్ మీడియా కథనాల ప్రకారం, ఇప్పుడు శ్రీదేవి ఇంట్లో ఉండేలా అవకాశం కల్పిస్తున్నారని చెబుతన్నారు.

నిజానికి Air BnB అనే ఒక హోటల్ బుకింగ్ సంస్థ ఈ ఇంటిని 11 ప్రసిద్ధ ఆస్తుల జాబితాలో చేర్చింది. ఇక ఇంటి మెయింటెనెన్స్ సమస్య, లీకేజీ కారణంగా శ్రీదేవి, బోనీలు ఈ ఇంటి నుంచి బయటకు వెళ్లారు. అయితే శ్రీదేవి మరణానంతరం బోనీ ఇంటికి మరమ్మతులు చేయించారు. శ్రీదేవి ఇంట్లో గడపాలని అనుకుంటున్న వారికి ఓ చిన్న కండిషన్ ఉంది. అదేమంటే Air BnB వినియోగదారులు మాత్రమే ఒక రాత్రి అందులో ఉండగలరు. విశేషమేమిటంటే ఇక్కడికి వచ్చేవారికి జాన్వీ కపూర్‌తో మాట్లాడే అవకాశం కూడా ఉంటుందట.

శ్రీదేవి వేసిన మొదటి పెయింటింగ్ కూడా ఈ ఇంట్లోనే ఉంది. కరోనా లాక్‌డౌన్ సమయంలో జాన్వీ ,  ఖుషీ కపూర్ వేసిన పెయింటింగ్‌లను కూడా ఇక్కడ చూసే అవకాశం ఉంది. చెన్నైలో ఆమె కొనుగోలు చేసిన మొదటి ఆస్తి ఇదే అని ఇండస్ట్రీలో అందరికీ తెలిసిందే. శ్రీదేవి పెళ్ళైన వెంటనే ఎంతో ముచ్చట పడి ఆ ఇంటిని కొనుగోలు చేశారు. ఎంతో ఖరీదైన, ఎన్నో విశేషాలు కలిగిన ఆ ఇంటిని రెంట్ కి ఇస్తూ ఉండడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.  

Related Posts

Comments

spot_img

Recent Stories