వామ్మో కోరిక మామూలుగా లేదుగా.. అలా పెళ్లి చేసుకోవాలంటా!

బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్‌ ప్రస్తుతం తెలుగులో వరుస అవకాశాలు దక్కించుకుని ఫుల్‌ బిజీగా ఉంది. ఈ క్రమంలోనే కొంత కాలం నుంచి ఈ అమ్మడు.. మాజీ ముఖ్యమంత్రి మనవడితో ప్రేమాయణం నడుపుతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. వీరి ప్రేమకు కుటుంబ సభ్యులు కూడా అంగీకారం తెలిపినట్లు సమాచారం. ఎందుకంటే…జాన్వీ ఎక్కడికి వెళ్లిన వెంట ఆమె ప్రియుడు కూడా కనిపిస్తుండండంతో ఆ విషయం వేరెవరో నోటి వెంట రావడం ఎందుకని బోనీనే వారి ప్రేమ వ్యవహారం గురించి ప్రకటించేశారంట.

వీరిద్దరూ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారో అన్న చర్చ నడుస్తున్న క్రమంలో ఆమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన పెళ్లి ఎలా జరగాలి, ఎక్కడ జరగాలి ? అనే విషయాలపై ఓ క్లారిటీ ఇచ్చింది. పెళ్లి సమయంలో ఎక్కువ జనం ఉండకూడదంట… ఎందుకంటే పెళ్లిలో అందరు తననే చూస్తే సిగ్గు వేస్తుందని చెప్పుకొచ్చింది. అందుకే అతి కొద్ది మందినే తన పెళ్లికి పిలుస్తాను అని పేర్కొనింది. అలాగే తన పెళ్లి తమిళ సంప్రదాయం ప్రకారం జరగాలని జాన్వీ కపూర్ చెప్పుకొచ్చింది.

అంతేకాకుండా తన పెళ్లిలో కాంచీపురం పట్టుచీర, తలనిండా మల్లెపూలు పెట్టుకోవాలని చెప్పింది. అంతేకాకుండా తన భర్త కూడా పంచె కట్టుకోవాలని తెలిపింది. అంతేకాకుండా పెళ్లికి వచ్చిన అతిథులందరికీ కూడా అరటి ఆకుల్లో విందు భోజనం పెట్టాలని అనుకుంటున్నట్లు జాన్వీ చెప్పుకొచ్చింది. జాన్వీ పెళ్లి  మొత్తం  తమిళ సంప్రదాయం పద్దతిలో జరగాలని చెప్పుకొచ్చింది.

Related Posts

Comments

spot_img

Recent Stories