వైరల్‌ అవుతున్న సూపర్‌ స్టార్‌ ఫోటోలు!

మహేష్ బాబు సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్‌ ను అందుకున్నారు.  ఈ సినిమా ఫిబ్రవరి 9 నంచి ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు అవుతోంది.  తాజాగా మహేష్‌ బాబు రాజమౌళి డైరెక్షన్‌ లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మహేష్‌ తన కుటుంబంతో కలిసి వేసవి సెలవులను ఎంజాయ్‌ చేయడానికి విదేశాలకు వెళ్లిపోయారు.

ప్రస్తుతం మహేష్ తన కుటుంబంతో కలిసి యూరోప్‌లో ఎంజాయ్ చేస్తోన్న సంగతి తెలిసిందే.  అందులో భాగంగా ఆయన తాజాగా కొన్ని ఫోటోలను తనసోషల్ మీడియా ఖాతా లో  షేర్‌  చేసారు. తన కూతురు సితారతో కలిసి మహేష్ బాబు దిగిన పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. ఆ ఫొటోలో మహేష్‌, సితార నవ్వుతూ కనిపిస్తున్నారు.

రాజమౌళి,  మహేష్ చేయబోయే సినిమా కోసం జర్మనీ వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ ఓ వారం పాటు టెక్నికల్ శిక్షణ తీసుకున్నట్లు ఆ మధ్య వార్తలువచ్చాయి. అది అలా ఉంటే.. ఈ సినిమా గురించి మరోవార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో మహేష్ బాబు ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే.. సూపర్ అని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈ సినిమాలో మహేష్ చాలా ఇంటెన్స్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడట.

Related Posts

Comments

spot_img

Recent Stories