దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా విజయసాయి మాటలు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్ తర్వాత అంతటి మహానాయకుడు తానేనని ప్రొజెక్టు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండే అనేక మందిలో ఒకడైన రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఇప్పుడు తలా తోకా లేకుండా మాట్లాడుతున్నారు. దేవాదాయ శాఖలో పనిచేస్తున్న ఒక మహిళా అధికారిని మభ్యపెట్టి లోబరుచుకుని ఆమెతో వివాహేతర సంబంధం కలిగి ఉండడంతో పాటు, ఆమెను బినామీగా వాడుకుని వందల కోట్ల విలువైన భూకబ్జాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఆయన మీద ఉన్నాయి. ఇవేమీ ఎవరూ ఫ్యాబ్రికేట్ చేసిన ఆరోపణలు కాదు. ఆమె భర్త స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి బహిరంగంగా వెల్లడించిన విషయాలు. ఇలాంటి నేపథ్యంలో తన మీద పడిన బురదను కడుక్కోవడానికి బదులుగా రాజకీయ ప్రత్యర్థులను మాటలు అనడానికి విజయసాయిరెడ్డి సాహసిస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ ఫక్తుగా ఒకే కులం కోసం పనిచేస్తుందట. ఈ విషయాన్ని రాష్ట్రంలో ఐదేళ్ల చిన్నారిని అడిగినా కూడా టిడిపి కుల ఆధిపత్యం గురించి చెబుతారట. వ్యాపారుల నిధులతో కుల చానల్స్ తప్పుడు వార్తలతో తెలుగుదేశం గెలిచిందట. ఇప్పుడు ప్రతిపక్షాల గొంతు నొక్కుతోందట. ఈ విషయాలు ఎవరికి చేదుగా అనిపించినా సరే ఆయన మాత్రం ఎప్పటికీ సత్యం మాట్లాడుతూనే ఉంటారట… విజయసాయి రెడ్డి ఎక్స్ లో చేసిన పోస్ట్ ఈ రకంగా సాగిపోయింది. విజయసాయి మాటలు వింటే అచ్చంగా దెయ్యాలు వేదాలు వల్లించడం అనే సామెత గుర్తుకు వస్తుంది. ఏమాత్రం నైతికత, కనీస ఆలోచన ఉన్నా కూడా ఇలాంటి మాటలు మాట్లాడడం సాధ్యం కాదు అని ప్రజలు భావిస్తున్నారు.

ఎందుకంటే కుల పూరితమైన, అసహ్యకరమైన పరిపాలన సాగించడానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచినది వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలన మరియు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. రెడ్డి వర్గానికి చెందినవారు తప్ప మరొకరు ఆ ప్రభుత్వంలో ఒక్క కీలక పదవిలో కూడా లేరు- అనేది ప్రపంచమంతా తెలిసిన సత్యం. రెడ్డి కాంట్రాక్టర్లకు తప్ప మిగిలిన వారికి బిల్లులు కూడా చెల్లించలేదని సొంత పార్టీ నుంచే ఆరోపణలు ఉన్నాయి. వైయస్ జగన్ జమానాలో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ, డీజీపీ, టీటీడీ చైర్మన్ పోస్టులు సహా సమస్తం రెడ్ల పిడికిట్లో పెట్టుకున్నారు.

చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పదవులు వేటిలో కూడా సొంతకులం వారు లేరు. చంద్రబాబు నాయుడు ఇంత మంచి పారదర్శక పరిపాలన అందిస్తుండగా కులం బురద చల్లడానికి విజయసాయి చేసిన ప్రయత్నం ఆకాశం మీద ఉమ్మినట్లుగా ఆయన మొహం మీదనే పడుతున్నది. విజయసాయి రెడ్డి తల మీద వస్తున్న ఆరోపణల నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికి తెలుగుదేశానికి కులం రంగు పులిమినంత మాత్రాన ప్రయోజనం లేదని, కొందరు నాయకులు, ఆయన మీద విమర్శలు చేసిన వారు డిమాండ్ చేస్తున్న విధంగా తన మీద ఆరోపణలు డీఎన్ఏ పరీక్షల వరకు వెళ్లకుండా చూసుకోవాలని ప్రజలు సలహా ఇస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories