అమ్మో ఒక్క సినిమాకే రెమ్యూనరేషన్‌ పెంచేసిందిగా!

ప్రస్తుతం ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్ల హవా నడుస్తుంది. దానికి తగ్గట్లు వారు నటించే మొదటి సినిమాలే సూపర్‌ డూపర్‌ హిట్‌ అవుతున్నాయి. దీంతో వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకునేందుకు తరువాత సినిమా నుంచే భారీ రెమ్యూనరేషన్‌ పెంచేందుకు రెడీ అయిపోతున్నారు.

ఈ జాబితాలోకి తాజాగా మలయాళ ముద్దుగుమ్మ, ప్రేమలు ఫేం మమిత బైజు కూడా చేరిపోయింది. నిన్న కాక మొన్న వచ్చిన ప్రేమలు చిత్రంతో ఈ అమ్మడు సూపర్‌ హిట్‌ అందుకుంది. దీంతో వరుస సినిమా ఆఫర్లు ఆమెను వెదుక్కుంటూ వస్తున్నాయి. అప్పుడే తమిళ స్టార్ నటుడు సూర్య పక్కన నటించేందుకు రెడీ అయిపోయింది కూడా.

కొన్ని కారణాల వల్ల ఆ సినిమా నుంచి మమిత బయటకు వచ్చేసింది. దానికి ఆమె డైరక్టర్ బాలా తనను కొట్టారని, చాలా సార్లు తిట్టారని కూడా తెలిపింది. దీంతో ఈ అంశం కోలీవుడ్ లో చర్చగా మారింది. అయితే తన కెరీర్ కు ఈ విషయం ఎక్కడ అడ్డుపడుతుందో అనే భయంతో ఆమె తనను కొట్టలేదని మళ్లీ చెప్పుకొచ్చింది.

ప్రేమలు సినిమా హిట్ కావడంతో ఆమెను వెదుక్కుంటూ సినిమా అవకాశాలు వస్తున్నాయి. దీంతో ప్రస్తుతం తమిళ హీరో జీవి ప్రకాశ్‌ తో రెబల్ అనే చిత్రంతో తమిళంలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్తున్నట్లు కూడా సమాచారం. ఈ సినిమా తరువాత విష్ణు విశాల్‌ కు జోడిగా నటించే అవకాశాన్ని కూడా చేజిక్కించుకుంది.

వరుస సినిమాలు రావడం, అవకాశాలు వరుస కట్టడంతో అమ్మడుకు డిమాండ్‌ కూడా భారీగానే పెరిగింది అనుకుందోమో.. రెమ్యూనరేషన్‌ కూడా పెంచేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం 30 లక్షలు తీసుకుంటుంటే..రాబోయే సినిమాలకు 50 లక్షలు తీసుకోనున్నట్లు సమాచారం.

Related Posts

Comments

spot_img

Recent Stories