ప్రభాస్‌ కి జోడిగా ఇద్దరు హీరోయిన్లు!

యంగ్‌ రెబల్‌ స్టార్‌ , పాన్‌ ఇండియా స్టార్‌ హీరో ప్రభాస్‌ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. ఓ పక్క చేతినిండా సినిమాలున్నప్పటికీ మరో పక్క కొత్త సినిమాలను లైన్‌ లో పెడుతున్నాడు. గతేడాది బాలీవుడ్ లో యానిమల్ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న సందీప్ రెడ్డి వంగ తో ప్రబాస్‌ ఓ సినిమా చెయ్యబోతున్నాడు. ప్రభాస్‌తో స్పిరిట్ సినిమా చేస్తున్నట్లు సందీప్ రెడ్డివంగా కొంతకాలం క్రితమే ప్రకటించారు.

ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్‌ పనుల్లో సందీప్ బిజీగా ఉన్నారు. ఈ ఏడాది డిసెంబర్ నుంచే స్పిరిట్ షూటింగ్ జరగనున్నట్లు చిత్ర బృందం చెప్పారు. అయితే తాజాగా ఈ చిత్రం గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ షికారు చేస్తుంది. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లను డైరెక్టర్ రంగంలోకి దింపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ప్రస్తుతం బాలీవుడ్ టు టాలీవుడ్ మంచి క్రేజ్ అందుకున్న స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ ని ఈ సినిమా కోసం సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . మరి ఇది ఎంతవరకు నిజమో చూడాలి.

అయితే ఈ సినిమాలో మరో కథానాయికగా లేడీ సూపర్ స్టార్ నయనతారను తీసుకుంటున్నట్లుగా సమాచారం. ఈ వార్తల్లో నిజమేంత ఉందో తెలియాలంటే మేకర్స్ నుంచి అప్డేట్ వచ్చేవరకు వెయిట్ చెయ్యాల్సిందే.. ప్రస్తుతం స్పిరిట్‌కి 60 శాతం స్క్రిప్ట్ వర్క్ పూర్తయినట్లు ఇటీవల సందీప్ రెడ్డి  ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. రూ.300 కోట్లకి పైగా బడ్జెట్‌‌తో ఈ చిత్రం తీయబోతున్నారు.. ఈ సినిమాలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories