యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ప్రధాన పాత్రలో, త్రిష కథానాయికగా, లెజెండరీ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన భారీ చిత్రం “థగ్ లైఫ్”పై భారీ అంచనాలు ఉండటమే కాదు, శింబు కూడా కీలక పాత్రలో ఉండటం వల్ల ఈ సినిమాపై క్యూరియాసిటీ మరింత పెరిగింది. కానీ ఆ అంచనాలను అందుకోలేకపోయింది. థియేటర్ లో విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో, ప్రేక్షకుల్లో మిక్స్డ్ రెస్పాన్స్ నెలకొంది.
ఇక ఓటిటి పరంగా చూస్తే, ముందుగా ఈ సినిమాను థియేటర్ రిలీజ్ అయ్యిన 8 వారాల తర్వాతే ఓటిటిలో రిలీజ్ చేస్తామని చిత్ర బృందం స్పష్టంగా చెప్పింది. అయితే థియేటర్లలో ఈ సినిమా ఫలితం అంత బలంగా లేకపోవడంతో, ఓటిటిలోనైనా త్వరగా రిలీజ్ చేసి వసూళ్లు తెచ్చుకోవాలన్న ఆలోచనతో మేకర్స్ ముందుకు వెళ్లారనే ప్రచారం జరుగుతుంది.
ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం, నెట్ఫ్లిక్స్ ఈ సినిమా సౌత్ ఇండియన్ వెర్షన్లను ముందుగా ఓటిటిలోకి తీసుకురావడానికి ఒప్పందాన్ని మార్చిందట. అయితే అసలు ఒప్పందానికి భిన్నంగా వ్యవహరించిన కారణంగా నెట్ఫ్లిక్స్ సంస్థే చిత్ర బృందానికి జరిమానా విధించిందనే వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపు 25 లక్షల రూపాయల ఫైన్ ఈ మేరకు విధించారని రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి.
అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు అధికారికంగా ఏదీ బయటకి రాలేదు. హిందీ వెర్షన్ మాత్రం మునుపటిలానే, థియేటర్ విడుదలై 8 వారాల తర్వాతే ఓటిటిలో ప్రసారం కానుందని సమాచారం. మొత్తంగా థగ్ లైఫ్ ఓటిటి విడుదల చుట్టూ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ చర్చలు నడుస్తున్నాయి.