సిద్దు కెరీర్ లో ఈ సినిమా ఓ మైలురాయి!

యంగ్‌ హీరో సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా నటించిన టిల్లు స్వ్కేర్‌ సినిమా శుక్రవారం గ్రాండ్‌ గా థియేటర్లలోకి విడుదలైంది. సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాకి నిర్మాతగా ఉండగా… మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా థియేటర్ లోకి వచ్చినప్పటి నుంచి కూడా మంచి పాజిటివ్ టాక్ అందుకుంది.

దీంతో మొదటి రోజే కలెక్షన్స్‌ చాలా ఎక్కువగా ఉంటున్నట్లు అనుకుంటున్నారు. అదీకాకుండా సిద్దు ముందు చేసిన డీజే టిల్లు సినిమాకి మంచి క్రేజ్‌ రావడంతో ఈ సినిమా మీద అంచనాలు బాగా పెరిగాయి. ఈరోజు గుడ్‌ ఫ్రైడే కావడంతో ఈ సినిమాకు బాగా కలిసి వచ్చింది. సెలవు కావడంతో మొదటి రోజు ఉదయం ఆట నుంచే అన్ని థియేటర్స్ లో హౌస్‌ ఫుల్‌ బోర్డులు పడ్డాయి. మధ్యాహ్నం కూడా ఆల్ మోస్ట్ అన్ని ఆటలు కూడా ఫుల్ అయ్యాయి.

దీని గురించి నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. సినిమా కోసం థియేటర్లను పెంచుతామని తెలిపారు. ఈ సినిమా వంద కోట్లు మార్క్ ని అందుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సినిమా ఓవర్సీస్‌ బాగా నడుస్తోందని, కలెక్షన్స్ కూడా బాగున్నాయని వివరించారు. ఈ సినిమా సిద్దు కెరీర్ లో ఓ మైలు రాయి అని చెప్పవచ్చు. ఈ సినిమా హిట్‌ కాదు…పెద్ద హిట్‌ అందుకోబోతుందని నిర్మాత అన్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories