జగన్ నీలి దళాలుర, సాక్షి మీడియా గ్రూపు మొత్తం ఇప్పుడు నానా బీభత్సమైన కసరత్తు చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలు కాగా, వారిలో సింగయ్య.. ఏకంగా జగన్ కారు కిందనే పడి చనిపోవడం ఇప్పుడు అతి పెద్ద వివాదం అవుతోంది. ఈ దుర్రఘటనపై నమోదు చేసిన కేసులోు జగన్ ఏ2 నిందితుడుగా ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి అమాయకుడని, ఆయన ఏపాపం ఎరగరని, సుద్దపూస అని చాటి చెప్పడానికి నీలి మీడియా నానా తంటాలు పడుతోంది. అది మాత్రమే కాదు.. చంద్రబాబునాయుడు చాలా కర్కశమైన మనిషి అని చాటి చెప్పడానికి కూడా ప్రయత్నిస్తూ ఉంది. ఈ క్రమంలో వారు చేస్తున్న పనులు, చూపిస్తున్న వీడియోలు జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు బుద్ధులనే బయటపెట్టే విధంగా ఉన్నాయి.
తాను ప్రయాణిస్తున్న కారు చక్రం కింద ఒక వ్యక్తి పడి దుర్మరణం చెందినా, మరొక వ్యక్త కూడా తన పర్యటనలో మరణించినా.. జగన్ ఏ మాత్రం పట్టించుకోకుండా నేరుగా రెంటపాళ్లకు వెళ్లి అక్కడ తన పరామర్శల డ్రామా ముగించుకుని, ప్రభుత్వం మీద కుదిరినంత బురద చల్లి తిరిగి వెళ్లారు. అంతే తప్ప చనిపోయిన వారి గురించి ఏమాత్రం పట్టించుకోను కూడా లేదు. ఈ విషయంపై సహజంగానే తెలుగుదేశం పార్టీ వారినుంచి మాత్రమే కాకుండా.. తటస్థుల నుంచి సామాన్య ప్రజల నుంచి కూడా బీభత్సంగా విమర్శలు వెల్లువెత్తాయి.
ఇలాంటి పరిస్థితుల్లో నష్టనివారణ కు సాక్షి కుటిల యత్నాలు ప్రారంభించింది. సాధారణంగా నాయకుల భారీ బహిరంగసభలు జరుగుతున్నప్పుడు.. కొన్ని ప్రమాదాలు జరగడం వింత కాదు. గతంలో కూడా అనేకం జరిగాయి. అలాంటి వాటిని ఇప్పుడు తెరమీదికి తెచ్చారు.
తన పర్యటనలో ఇద్దరు చచ్చిపోతే.. జగన్ ఏమాత్రం పట్టించుకోకుండా.. పరామర్శ అనే ముసుగులో రెంటపాళ్లకు వెళ్లారని విమర్శలు వస్తున్న తరుణంలో- సాక్షి మీడియా వారికి అలవాటైన ధోరణిలో గతంలో చంద్రబాబు ఇలా చేశారు కదా అని చెప్పడానికి ప్రయత్నిస్తున్నది. గతంలో చంద్రబాబు ప్రచార సభలో కొందరు గాయపడి ఆస్పత్రి పాలైతే.. ఆయన మీటింగు ఆపలేదని ప్రస్తావిస్తున్నది. కానీ వారు చూపిస్తున్న వీడియోలోనే.. చంద్రబాబు.. ‘తమ్ముళ్లూ నేను ఇప్పుడు ఆస్పత్రికి వెళ్లి వారిని చూసి వస్తాను.. మీరు ఇక్కడే ఉంటారా’ అని అడిగి.. ప్రజలు ఆయనకు ఓకే చెప్పిన తర్వాత మాత్రమే వెళ్లడం జరిగింది. తర్వాత వచ్చి మీటింగు కంటిన్యూ చేయడం జరిగింది. అది చంద్రబాబులోని మానవత్వానికే నిదర్శనం కదా అనేది పలువురి వాదన. అదే జగన్ విషయంలో ఆయన తన ప్లాన్డ్ పర్యటన మాత్రం చూసుకున్నారు. చచ్చిపోయిన వాళ్లను పట్టించుకోలేదు. పరామర్శించలేదు. సాయం చేయడం కాదు కదా, కనీసం సానుభూతి వాక్యాలు కూడా పలకలేదు. జగన్ అసలు బుద్ధి అదేనని.. ఇదే యాత్రలో పోలీసు సెక్యూరిటీ వాహనం కింద పడి ఎవరైనా గాయపడి ఉంటే జగన్ ఇలా చేసి ఉండేవారా? అని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.