టాలీవుడ్లో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అంటేనే గుర్తొచ్చే పేర్లలో బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ ప్రత్యేకంగా ఉంటుంది. ఈ ఇద్దరూ కలిసి తీసిన ‘అఖండ’ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ ఎలా ఉంటే, ఇప్పుడు దాని సీక్వెల్గా తెరకెక్కుతున్న ‘అఖండ 2’పై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదలై మంచి హైప్ను క్రియేట్ చేసింది. బాలకృష్ణ పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్, బోయపాటి మాస్ మేకింగ్ స్టైల్ ఈ టీజర్లో స్పష్టంగా కనిపించాయి. అందుకే ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులతో పాటు బాలీవుడ్ ఆడియన్స్ కూడా ఆసక్తిగా చూస్తున్నారు.
ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయాలని మేకర్స్ సిద్ధమవుతున్నారు. అంతేగాక, ఈ టీజర్ ప్రొడక్షన్కు ఏకంగా కోటిన్నర రూపాయలు ఖర్చు పెట్టారట. దీన్ని బట్టి ఈ సినిమా ప్రమోషన్లను ఎంత గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నారో అర్థమవుతోంది.
ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్, సంయుక్త మీనన్ కథానాయికలుగా కనిపించనున్నారు. ముఖ్యమైన పాత్రలో ఆది పినిశెట్టి నటిస్తున్నాడు. సంగీతం థమన్ తన మార్క్ మ్యూజిక్తో సినిమాకు బలం చేకూర్చనున్నాడు.
ఈ ప్రాజెక్ట్ను ప్రముఖ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. మొత్తానికి మాస్ ప్రేక్షకుల కోసం బోయపాటి – బాలయ్య కాంబో మరోసారి స్క్రీన్పై మంటలు పుట్టించేందుకు సిద్ధంగా ఉంది.