రేషన్ రూపంలో అరాచకాలకు, దోపిడీకి ఇక చెక్

రేషన్ దుకాణాలకు వచ్చే చౌక బియ్యాన్ని ఇళ్ల వద్ద ఇచ్చినంత వరకు ఇచ్చి.. మిగిలిన వాటిని బియ్యం స్మగ్లింగ్ ముఠాల వద్దకు తరలించడానికి జగన్ సర్కారు వ్యూహాత్మకంగా ‘ప్రత్యేక వాహనాలను’ వాడుకుంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలే రేషన్ బియ్యం అక్రమ రవాణా రూపంలో వేల కోట్లరూపాయల ప్రజాధనం కాజేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. జగన్.. తానేదో ఘనకార్యం చేస్తున్నట్టుగా బిల్డప్పులు ఇచ్చి.. ఇళ్ల వద్దకే రేషన్ సరుకులు అందజేస్తాం అని ప్రకటించి.. కొత్త దందాను కనిపెట్టారు. వందల కోట్ల రూపాయలు వెచ్చించి.. రేషన్ సరఫరా కు వాహనాలు కొనుగోలు చేశారు. వాటిద్వారా పంపిణీ జరిగేది. అవి వచ్చే సమయానికి ఇళ్లవద్ద లేకపోతే ఇక ఆ నెలలో రేషన్ మిస్సయినట్టే. ఇక జనానికి ఇవ్వకుండా ఆపిన బియ్యం మొత్తాన్ని స్మగ్లింగ్ ముఠాలకు అప్పగించేవారు. అలాగే.. ఎవరైనా రేషన్ బియ్యం వద్దని అనుకుంటే గనుక.. వారికి వాహనదారులే ఎంతో కొంత నామమాత్రపు డబ్బు లిచ్చేసి.. ఆ బియ్యాన్ని స్మగ్లర్ల చెంతకు చేర్చేవారు. ఆ రకంగా స్మగ్లింగ్ దందాకు ఈ వాహనాల వ్యవస్థ బాగా తోడ్పడుతూ వచ్చింది. దీనిని గుర్తించిన కూటమి ప్రభుత్వం ఇటీవల కేబినెట్ భేటీలో వాహనాల ద్వారా పంపిణీ వ్యవస్థను రద్దుచేసి.. రేషన్ దుకాణాల వద్దనే సరుకులు తీసుకునే పద్ధతిని ఆమోదించారు. జూన్ నెలలో రేషన్ సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రులంతా వేర్వేరు చోట్ల ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మరో కొత్త ఆలోచనను పంచుకున్నారు.

కార్డు దారులకే ఆప్షన్ ఇవ్వడం ద్వారా.. బియ్యం వద్దనుకునే వారికి నగదు ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నట్టుగా ఆయన వెల్లడించారు.
ఈ ఆలోచన చాలా మంచిదని ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వం ఒక్కో కిలో బియ్యం మీద పెద్ద మొత్తం వెచ్చించి కొనుగోలు చేస్తుంది. ప్రజలకు రూపాయి ధరకు (ఉచితంగా) ఇస్తుంది. తీసుకున్న వారిలో చాలా మంది ఆ బియ్యం వాడుకోవడం ఇష్టం లేక.. వాటిని కిలో రూ.10 వంతున అక్రమ వ్యాపారులకు అడ్డుకుంటూ ఉంటారు. అంటే దాదాపు చాలా పెద్ద మొత్తం ప్రతి కిలో మీద నగదు వృథా అవుతున్నదన్నమాట. ఈ పరిస్థితిని నివారించడానికి బియ్యం కొనుగోలు కోసం ప్రభుత్వం వెచ్చించేమొత్తాన్ని నేరుగా లబ్ధిదారులకు ఇస్తే మేలు జరుగుతుంది.

రేషన్ రూపంలో అక్రమాలు జరగడానికి, బియ్యం  స్మగ్లింగ్ కు ఆస్కారం లేకుండాపోతుందని పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories