అప్పుడాలా… ఇప్పడిలా!

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దుబాయ్‌ లోని మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో ఆయన విగ్రహాన్ని గురువారం ఆవిష్కరించిన విషయం అందరికీ తెలిసిందే. బన్నీ మొదటి చిత్రం గంగోత్రి నుంచి రాబోయే పుష్ప 2 వరకు కూడా ఆయన ఎదిగిన తీరు ఎంతగానో అభిమానులను ఆకట్టుకున్నాడు.

ఈ క్రమంలో అల్లు అర్జున్‌ సోదరుడు నటుడు అల్లు శిరీష్‌ బన్నీ సినీ జర్నీ ని గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో ఓ ఇంట్రస్టింగ్‌ పోస్ట్‌ ను షేర్‌ చేసుకున్నాడు. 15 సంవత్సరాల క్రితం మా కుటుంబం మేడమ్‌ టుస్సాడ్స్‌ ని సందర్శించడానికి మేమంతా పర్యాటకులుగా వెళ్లాము. కానీ ఈ రోజు మేమంతా మా సొంత విగ్రహంతో ఫోటోలు క్లిక్‌ మనిపించుకుంటున్నాం. దీనిని గురించి మేము ఎప్పుడూ కూడా అనుకోలేదు.

బన్నీ వాటే జర్నీ! నిన్ను చూసి నేను చాలా గర్వపడుతున్నాను. అంతేకాకు అప్పుడు దిగిన కొన్ని ఫోటోలను కూడా శిరీష్‌ ఈ పోస్ట్‌ కు షేర్‌ చేశాడు. దీంతో ఈ పోస్ట్ కాస్త వైరల్ గా మారింది.

Related Posts

Comments

spot_img

Recent Stories