నవరాత్రుల్లో మూడో సినిమా!

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్లలో తన మొదటి సినిమాతోనే సత్తా చాటిన యంగ్ డైరెక్టర్‌ ప్రశాంత్ వర్మ కూడా ఒకరు. మరి ప్రశాంత్ వర్మ తెలుగు సినిమలో మొదటి  సినిమానే సూపర్‌ హీరో సినిమాగా చేసి సెన్సేషనల్ సక్సెస్ ని అందుకొని పాన్ ఇండియా దర్శకుల పక్కన కుర్చీ వేసుకొని కూర్చున్నాడు.

ఇక్కడ నుంచి మరిన్ని భారీ సినిమాలు తాను చేస్తుండగా… ఇప్పుడు నటసింహం బాలయ్య వారసుడు నందమూరి మోక్షజ్ఙ తేజని ఇండస్ట్రీకి తన సినిమాటిక్ ప్రపంచం నుంచి పరిచయం చేయబోతున్నాడు. అయితే తన సినిమాటిక్ యూనివర్స్ నుంచి సాలిడ్ అప్డేట్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చాడు.

ఈ దేవి నవరాత్రుల సమయంలోనే ఈ అక్టోబర్ 10న  ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి మూడో సినిమాని  ప్రకటిస్తున్నట్లుగా   కన్ఫర్మ్ చేసాడు. మరి ఆ సినిమా ఏంటి అనేది ఆరోజు తెలియనుంది. ప్రస్తుతం అయితే జై హనుమాన్, మోక్షజ్ఙ సినిమాలతో తాను ఫుల్‌ బిజీగా ఉన్నాడు.

Related Posts

Comments

spot_img

Recent Stories