టాలీవుడ్కి ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చిన చిత్రాల్లో ఒకటే “ఈ నగరానికి ఏమైంది?”. 2018లో విడుదలైన ఈ సినిమా యూత్లో చక్కటి గుర్తింపు తెచ్చుకుంది. విశ్వక్ సేన్, సాయి సుశాంత్ రెడ్డి, అభినవ్ గోమటమ్, వెంకటేష్ కకుమాను లాంటి నటుల సహకారంతో ఈ సినిమా థియేటర్లలో నవ్వులు పూయించింది. దర్శకుడు తరుణ్ భాస్కర్ తన స్టైల్ డైరెక్షన్తో ఈ సినిమాను అద్భుతంగా మలిచారు. అప్పుడు ఈ మూవీకి వచ్చిన క్రేజ్తో పాటు సోషల్ మీడియాలో కూడా ఈ సినిమాకు సంబంధించి మీమ్స్ విపరీతంగా వైరల్ అయ్యాయి.
ఇప్పుడు ఇదే గ్యాంగ్ మళ్లీ తిరిగి కలవబోతుందన్న వార్తపై ఫ్యాన్స్ లో భారీ ఆసక్తి నెలకొంది. అప్పటినుంచి కొనసాగుతున్న ఊహాగానాలకు బ్రేక్ వేస్తూ చిత్ర బృందం తాజా ప్రకటన చేసింది. “ఈ నగరానికి ఏమైంది”కి కొనసాగింపుగా సీక్వెల్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి ఓ స్పెషల్ పోస్టర్ కూడా విడుదల చేశారు. ఇందులో హీరోలంతా మళ్లీ కలసి కనిపిస్తూ, మరోసారి అలరిస్తారని సంకేతాలు ఇచ్చారు.
‘టీమ్ కన్యా రాశి వస్తోంది’ అనే లైన్తో మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేయడం ద్వారా జూన్ 28, 29 తేదీల్లో మరిన్ని అప్డేట్స్ రానున్నాయన్న సంకేతం ఇచ్చారు. మరోసారి తరుణ్ భాస్కర్ తనదైన శైలిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతుండగా, ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.
ప్రస్తుతం టాలీవుడ్లో ఫ్రెష్ కాన్సెప్ట్ కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులకి ఇది కచ్చితంగా మంచి ట్రీట్ అయ్యేలా ఉంది. మళ్లీ అదే జోష్తో, కొత్త కంటెంట్తో ‘ఈ నగరానికి ఏమైంది 2’ వచ్చేస్తుందన్న మాటలోనే ఎంతో క్రేజ్ ఉందనే చెప్పాలి.