పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఓజి’ ఇప్పటికే భారీ అంచనాల మధ్య తెరకెక్కుతోంది. సుజీత్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్ట్ లో ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తోంది. పవన్ ఫ్యాన్స్ ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఈ సినిమా ప్రస్తుతం ఫుల్ స్పీడ్ తో షూటింగ్ జరుపుకుంటోంది. ఇటీవలే పవన్ కళ్యాణ్ తన పార్ట్ పూర్తి చేశారని సమాచారం వచ్చిందంటే.. సినిమా నిర్మాణం చివరి దశలోకి చేరినట్టే అనిపిస్తుంది.
ఇక ఇందులో కీలకమైన విలన్ రోల్ చేయడం బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ సంగతి తెలిసిందే. అయితే కొన్ని రోజులుగా ఆయన షూటింగ్ లో పాల్గొనలేదని వార్తలు వచ్చాయి. మొదట ఈ గ్యాప్కి కారణం ఆయనకు కరోనా వచ్చిందని ప్రచారం జరిగింది. కానీ తాజా సమాచారం ప్రకారం అది నిజం కాదని స్పష్టమైంది. అసలు విషయమేమంటే, ఇమ్రాన్ హష్మీకి డెంగ్యూ వచ్చిన కారణంగా కొంతకాలం విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చిందట.
ప్రస్తుతం ఆయన పూర్తిగా కోలుకొని తిరిగి షూటింగ్ లో పాల్గొంటున్నట్టు తెలుస్తోంది. దీంతో చిత్రబృందం కూడా ఊపందుకుని మిగతా భాగాల్ని పూర్తి చేసే పనిలో పడిపోయింది. ఇమ్రాన్ హష్మీ తిరిగి సెట్స్ లో జాయిన్ అవ్వడంతో ఆయన పాత్రకి సంబంధించి కీలక సన్నివేశాలను త్వరితగతిన చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఓజి సినిమా పనులు చివరి దశకు చేరుతున్నాయని, త్వరలోనే మరిన్ని అప్డేట్స్ అభిమానులను రచ్చకెక్కించనున్నాయని టాక్ వినిపిస్తోంది.