కింజరాపు వారికి జగన్‌పై చాలా సానుభూతి ఉందే!

తెలుగుదేశం పార్టీకి చెందిన యువ నాయకుల్లో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఏ అంశంమీద అయినా సాధికారంగా మాట్లాడే తత్వం ఆయనది. ఆయన పార్లమెంటు ప్రసంగాలు కూడా విలక్షణంగా ఉంటాయి. అలాంటి కింజరాపు రామ్మోహన్ నాయుడు.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద వేసిన సెటైర్ కూడా చాలా తమాషాగానే ఉంది. ఒకవైపు రాష్ట్రంలో కొలువు తీరిన ఎన్డీయే కూటమి ప్రభుత్వం సమతుల్య అభివృద్ధి దిశగా పరిపాలన సాగిస్తుండగా.. వెన్నుపోటు దినోత్సవం అంటూ ప్రజల మద్దతు లేని నిరసన దీక్షలు నిర్వహించి.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభాసుపాలైన సంగతి అందరికీ తెలిసినదే.

ఈ వైనం మీద.. కూటమి నాయకులు ఒక్కొక్కరు ఒక్కోతీరుగా స్పందిస్తున్నారు. వ్యాఖ్యలు రవ్వుతున్నారు. కింజరాపు రామ్మోహన్ నాయుడు కూడా శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ జగన్ తన తీరు మార్చుకోకపోతే.. ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీ ఒకే ఒక్క స్థానానికి పరిమితం అవుతుందని అంటున్నారు.
వైసీపీ ప్రభుత్వం అయిదేళ్లలో చేయలేకపోయిన ఎన్నో పనులను చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఏడాది కాలంలోనే చేసి చూపిస్తున్నదని చెబుతున్న కింజరాపు రామ్మోహన్ నాయుడు.. ఏపీ బ్రాండ్ ఇమేజిని దెబ్బతీయడమే  పనిగా.. జగన్మోహన్ రెడ్డి చవకబారు రాజకీయాలు చేస్తున్నారని అంటున్నారు.  

దురుద్దేశాలతో కూడిన ఆందోళనలు నిర్వహించడం తప్ప.. ప్రభుత్వంలో ఏమైనా లోపాలు ఉంటే వాటిని క్రియాశీలంగా విమర్శించడం, ప్రజలకు మేలు జరిగేలా నిర్మాణాత్మక సూచనలు చేయడం వంటివి జగన్ పట్టించుకోలేదని కింజరాపు అంటున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం ద్వారా.. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చూడాలని జగన్ కుట్రలు చేస్తున్నట్టుగా కింజరాపు అంటున్నారు.

ఆయన మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రానికి జగన్ తీరని ద్రోహం చేశారు గనుకనే.. దానిని గుర్తించిన ప్రజలు ఆయన పార్టీని 11 సీట్లకు పరిమితం చేశారని.. ఆయన తీరు మార్చుకోకపోతే ఈసారి ఒకస్థానమే దక్కుతుందని’’ అంటున్నారు. అయితే ప్రజలు మాత్రం.. జగన్ తన పేలవమైన పార్టీ నిర్వహణ కారణంగా.. పసలేని ప్రజల మద్దతులేని పోరాటాలద్వారా.. మరింత పరువు పోగొట్టుకుని ఈ అయిదేళ్లలో పార్టీని పూర్తిగా గంగలో కలిపేస్తారని రాబోయే ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేరని

సెటైర్లు వేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ కు ఒక్క సీటు దక్కుతుందని కింజరాపు అనడం గమనిస్తే.. ఆయనకు జగన్ మీద పాపం.. చాలా సానుభూతి ఉన్నట్టుగా కనిపిస్తోందని జనం నవ్వుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories