గేమ్‌ ఛేంజ్‌ అవ్వబోతుంది..చరణ్‌ నుంచి క్రేజీ పోస్ట్‌!

స్టార్ డైరెక్టర్ శంకర్ – మెగాపవర్ స్టార్ ‘రామ్ చరణ్ తేజ్’ కాంబోలో రాబోతున్న పాన్ ఇండియా సినిమా గేమ్ ఛేంజర్‌. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ఈ మైలురాయికి గుర్తుగా, రామ్ చరణ్ ఈ ఉదయం ఓ ఇన్‌ స్టా స్టోరీని అభిమానులతో పంచుకున్నారు. చరణ్ హెలికాప్టర్ల వైపు నడుస్తున్న రెండు చిత్రాల కోల్లెజ్‌ను పోస్ట్ చేశారు, ఒకటి సినిమాలోనిది కాగా, మరొకటి చిత్రీకరణ పూర్తయిన తర్వాత తీసిన పిక్. పైగా ఈ పిక్స్ కింద “గేమ్ మారబోతోంది” అని క్యాప్షన్ కూడా రాసుకొచ్చాడు.

అదేవిధంగా, ‘మా “గేమ్‌ఛేంజర్” చరణ్ సినిమా షూటింగ్ మొదటి రోజు నుండి చివరి వరకు సాగిన మెగా పవర్ ప్యాక్డ్ జర్నీ. తాజాగా షూటింగ్ ముగిసింది. త్వరలో కొన్ని సాలిడ్ అండ్ క్రేజీ అప్‌డేట్‌లను మీ ముందుకు తీసుకువస్తున్నాము’ అంటూ చిత్రబృందం కూడా ఒక పోస్ట్ పెట్టి తెలిపింది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రానున్న ఈ సినిమాలో చరణ్ తండ్రీకొడుకులుగా యాక్ట్‌ చేస్తున్నారు. కాగా ఈ మూవీలో చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌ గా చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాలో  అంజలి, శ్రీకాంత్, ఎస్‌జె సూర్య, నవీన్ చంద్ర వంటి ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories