బాబుగారింటి కోసమే లంచం డిమాండ్‌…ఎంత మితిమీరిపోయార్రా!

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటి స్థలం కోసం ఓ డిప్యూటీ సర్వేయర్ లంచాన్ని డిమాండ్‌ చేసిన సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  కుప్పంలో సీఎం చంద్రబాబు వ్యవసాయ భూమిని ఇంటి స్థలంగా మార్చేందుకు  ఓ డిప్యూటీ సర్వేయర్‌ లంచం డిమాండ్‌ చేశాడు. చంద్రబాబు రాష్ట్రంలో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో శాంతిపురం మండలం కడపల్లె పంచాయతీ శివపురం లో ఓ రైతు వద్ద   వ్యవసాయ స్థలాన్ని కొనుగోలు చేశారు. ఆ స్థలం నేషనల్‌ హైవే పక్కనే ఉంది.

దానిలో ఇంటి నిర్మాణం చేసేందుకు టీడీపీ నాయకులు వ్యవసాయ భూమిని గృహ నిర్మాణానికి అనువుగా మార్చేందుకు దరఖాస్తు ఇచ్చారు. ఆ స్థలాన్ని సబ్‌ డివిజన్‌ చేయాలని కోరాగా, ఆనాడు డిప్యూటీ సర్వేయర్‌ సద్దాం హుస్సెన్‌ రూ. 1.80 లక్షల లంచాన్ని టీడీపీ నాయకుల వద్ద నుంచి  డిమాండ్‌ చేశారు. తప్పని సరి పరిస్థితుల్లో ఆ లంచం మొత్తం డిప్యూటీ సర్వేయర్‌ కి అందించడంతోనే ఆ కాగితాలు ముందుకు కదిలాయి.

జూన్‌ నెలలో  చంద్రబాబు సీఎం హోదాలో కుప్పానికి వచ్చినప్పుడు ఆయన బస చేసిన ఆర్‌అండ్‌ బీ అతిథి గృహం వద్ద స్థానిక నేతల మధ్య ఈ విషయం మాటల్లోకి  రాగా…కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌, జాయింట్‌ కలెక్టర్‌ శ్రీనివాసులు ఈ విషయం గురించి ఆరా తీయగా..ఈ లంచం బాగోతం వెలుగు చూసింది.

సర్వే శాఖ ఏడీ గౌస్‌ భాషాతో విచారణ చేయించగా..లంచం తీసుకున్న మాట నిజమే అని తేలింది.భూ సర్వే కోసం సద్దాం హుస్సేన్‌ లక్ష డిమాండ్‌ చేసినట్లు గత నెలలో శాంతిపురానికి చెందిన ఓ రైతు కూడా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.  దీని పై విచారణ జరిపి..అది కూడా నిజమే అని అధికారులు నిర్థారించారు. ఈ అంశాల పై మంగళవారం సాయంత్రానికల్లా నివేదిక ఇవ్వాలని జాయింట్‌ కలెక్టర్‌ ఏడీని ఆదేశించారు. డిప్యూటీ సర్వేయర్‌ ను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Related Posts

Comments

spot_img

Recent Stories