మహేష్‌ ని ఫిదా చేసిన బాలీవుడ్‌ మూవీ!

ఆమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో వచ్చిన తాజా చిత్రం సితారే జమీన్ పర్ ఇప్పటికే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటోంది. ఎమోషన్, వినోదం, మంచి సందేశం అన్నీ కలిపిన ఈ సినిమా చాలా మందిని ఆకట్టుకుంటోంది. కథా పరిణామాలు, నటీనటుల అభినయం, విజువల్స్ అన్నీ కలిపి ఓ మంచి అనుభూతిని అందిస్తున్నాయి.

ఈ సినిమాలోని నాటి ఆమిర్ ఖాన్ మ్యాజిక్ మళ్లీ కనిపించిందని పలువురు ప్రేక్షకులు అంటున్నారు. తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా ఈ సినిమాని చూసి భావోద్వేగానికి గురయ్యారు. ఆయన సోషల్ మీడియాలో ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని పంచుకుంటూ, ఇది తనను ఎంతో కలచివేసిందని తెలిపారు. నవ్విస్తూ, కళ్ళను తడిపిస్తూ సాగిన ఈ ప్రయాణం తాను ఎప్పటికీ మర్చిపోలేనని ఆయన భావం.

మహేశ్ బాబు ఇలా స్పందించడమే కాదు, చిత్ర బృందానికి తన అభినందనలు తెలియజేశారు. సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ చిరునవ్వుతో థియేటర్ నుంచి బయటకు వస్తారనేది ఆయన మాటల్లో అర్థమవుతోంది.

ఇక ఈ నెల 20న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులే కాదు సెలబ్రిటీలు కూడా ప్రశంసలు కురిపించేలా చేసింది. ఇప్పటికే క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ వంటి వారు కూడా ఈ సినిమాపై తమ హృదయాలను ఓపెన్ చేశారు. అన్నింటి కంటే ముఖ్యంగా, ఈ సినిమా మనసును తాకేలా ఉండటం వల్లే ఇది ఈ స్థాయిలో స్పందన పొందుతోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories