సీరియల్‌ కిల్లర్‌ గా ఆలనాటి అందాల తార!

నగేష్ కుకునూర్ భారతీయ చలనచిత్రంలో అత్యంత ప్రతిభావంతులైన దర్శకులలో ఒకరు. అంతేకాక అతను తెలుగు వ్యక్తి. గతంలో కూడా కొన్ని తెలుగు చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన చాలా హిందీ చిత్రాలను రూపొందించారు. ఇప్పుడు, తాజా అప్డేట్ ప్రకారం, ఆయన  స్టార్ హీరోయిన్ మాధురీ దీక్షిత్‌ తో ఒక వెబ్ సిరీస్ ను చేయబోతున్నారు. మిసెస్ దేశ్‌పాండే అనే టైటిల్ తో ఇది తెరకెక్కనుంది.

ఒక సీరియల్ కిల్లర్‌ను కనుగొనడానికి పోలీసులు సీరియల్ కిల్లర్‌ను నియమించుకోవడం గురించి ఈ సిరీస్ సాగబోతుంది. ఈ సిరీస్ ఫ్రెంచ్ సిరీస్‌కి రీమేక్ అని, భారీ స్థాయిలో రీమేక్ చేయనున్నట్టు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. మోడరన్ లవ్ హైదరాబాద్ తర్వాత నగేష్ కుకునూర్ మళ్ళీ ఓటీటీ స్పేస్‌కి తిరిగి రాబోతున్నాడు. ఈ సిరీస్ కి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కాబోతున్నాయి.

Related Posts

Comments

spot_img

Recent Stories