గ్యాప్‌ అందుకే వచ్చింది!

‘బాహుబలి’ తో పాన్ ఇండియా రేంజ్‌ లో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న  రానా గత కొంత కాలంగా సినిమాల విషయంలో చాలా గ్యాప్‌ తీసుకున్నాడు. కెరీర్ స్టార్టింగ్ లో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేసిన రానా ప్రస్తుతం సినిమాకి  సినిమాకి మధ్య చాలా గ్యాప్ తీసుకుంటున్నాడు. గత కొంత కాలంగా చూసుకుంటే ఈ హీరో నుంచి సినిమా వచ్చి రెండేళ్లు అయిపోతుంది.

చివరగా రానా 2022 లో ‘విరాట పర్వం’ సినిమాతో ప్రేక్షకులకు కనిపించాడు. మళ్లీ ఆయన నుంచి ఇప్పటిదాకా మరో సినిమా థియేటర్లలోకి రాలేదు. ఆ మధ్యలో ‘రానా నాయుడు’ అనే వెబ్ సిరీస్ తో ఓటీటీలో కనిపించాడు. అలాగే నిఖిల్ ‘స్పై’ మూవీలో క్యామియోతో అలరించాడు. అయితే రానా తాజాగా తన సినీ కెరీర్‌ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

దాదాపు రెండేళ్ల నుంచి వెండితెరపై కనిపించకపోవడం గురించి ఐఫా ఉత్సవ్‌ ప్రెస్‌మీట్‌లో ఆయన వివరించారు. “నా జీవితం అంతా కొత్త సినిమాలు చేస్తూ వచ్చాను. ఇప్పుడు ఆ సినిమాలు మామూలు అయిపోయాయి. అందరూ చేసేస్తున్నారు. కొత్తగా ఏదైనా చేద్దామని చాలాకాలంగా వెతుకుతున్నా. అలా సుమారు రెండేళ్లు అయిపోయాయి. త్వరలోనే కొత్త సినిమా గురించి ఆసక్తికర విషయాలు మీతో పంచుకుంటా” అని వివరించాడు. దీంతో రానా చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

Related Posts

Comments

spot_img

Recent Stories