పూజా కార్యక్రమాలతో మొదలైన సన్నీ డియోల్‌- గోపిచంద్‌ సినిమా!

టాలీవుడ్ యంగ్‌ దర్శకుడు గోపీచంద్ మ‌లినేని ప్రేక్ష‌కుల‌ను స‌ర్ ప్రైజ్ చేస్తూ ఓ క్రేజీ ప్రాజెక్టును మొదలు పెట్టారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేక‌ర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తూ ఇండియాన్ బిగ్గెస్ట్ యాక్ష‌న్ మూవీని ప్రకటించారు. బాలీవుడ్ యాక్ష‌న్ హీరో స‌న్నీ డియోల్ ఇందులో ముఖ్యపాత్రలో న‌టిస్తున్నారు. కాగా ఈ సినిమాను అనౌన్స్ చేయ‌డంతో పాటు ఈ చిత్రాన్ని మూవీ మేకర్స్‌ గురువారం ప్రారంభించారు.

పూజా కార్య‌క్రమాల‌తో ఈ సినిమాను ప్రారంభించారు. ఈ ప్రారంభోత్స‌వానికి హీరో స‌న్నీ డియోల్ తో పాటు, నటి రెజీనా క్యాసాండ్ర‌, స‌యామీ ఖేర్ లు కూడా వచ్చారు. పూర్తి మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ గా ఈ సినిమాను గోపీచంద్ మ‌లినేని రూపొందిస్తున్నారు.

 రిషి పంజాబీ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. న‌వీన్ నూలి ఈ సినిమాకు ఎడిట‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కాగా, ఈ చిత్ర షూటింగ్ ను అతి త్వ‌ర‌లో ప్రారంభించ‌నున్న‌ట్లు చిత్ర బృందం తెలిపింది.

Related Posts

Comments

spot_img

Recent Stories