సుబ్రహ్మణ్యం కోసం రంగంలోకి దిగిన సుకుమార్‌!

ఈవారం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద విడుదల అవుతున్న సినిమాల్లో ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’ సినిమా ఒకటి. ఈ సినిమా ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసుకుంది. ఈ సినిమాలో రావు రమేష్ ప్రధాన పాత్రలో నటిస్తుండటంతో ఈ మూవీని చూసేందుకు ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఉన్నారు. లక్ష్మణ్ కార్య డైరెక్ట్ చేసిన ఈ సినిమా పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా అలరించేందుకు రెడీ అయ్యింది.

ఇక ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను చిత్ర యూనిట్ గ్రాండ్‌గా నిర్వహించేందుకు రెడీ అయ్యింది. ఇక ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రానున్నట్లు సినిమా బృందం ఇప్పటికే తెలిపింది. అయితే, ఆయనతో పాటు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కూడా ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు రానున్నట్లు మూవీ మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఈ ప్రీ-రిలీజ్ వేడుక ఆగస్టు 21న పార్క్ హయత్ హోటల్‌లో సాయంత్రం 6 గంటల నుంచి నిర్వహించనున్నారు.

ఈ సినిమాలో సీనియర్ నటి ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్స్ ఈ చిత్రాన్ని విడుదల చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకుని రాబోతున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories