ఆ వింటేజ్ మ్యాజిక్ రిపీట్ చేయనున్న శ్రీను వైట్ల!

మన టాలీవుడ్‌ దర్శకుల్లో టాప్ మోస్ట్‌ డైరెక్టర్స్‌ లో శ్రీను వైట్ల ఒకరు.  తన కెరీర్ లో టాలీవుడ్ కి సాలిడ్ హిట్స్ ని ఇచ్చిన ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల టాలీవుడ్‌ కి ఎన్నో సాలిడ్‌ హిట్లను అందించారు. వాటిలో మోస్ట్‌ ఎంటర్‌టైనర్ సినిమాలు ఢీ, వెంకీ, దుబాయ్‌ శీను సినిమాలు కూడా ఉన్నాయి.

అయితే ఈ అన్ని సినిమాల్లో కూడా ఏదోక ఐకానిక్ సీన్ ట్రెండ్ సెట్టింగ్ కామెడీ సీన్ గా నిలిచిపోయింది. అలా మాస్ మహారాజ రవితేజతో చేసిన చిత్రం “వెంకీ” లో ట్రైన్ కామెడీ సీన్ ఎంత పెద్ద హిట్ అనే విషయం అందరికీ తెలిసిందే. మరి మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత తన రాబోయే సినిమాలో మరోసారి ట్రైన్ కామెడీ సీన్ ని పెడుతున్నట్టుగా శ్రీను వైట్ల ఎపుడో కన్ఫర్మ్ చేశారు. మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా చేస్తున్న లేటెస్ట్ చిత్రం “విశ్వం” లో ఈ వింటేజ్ ట్రాక్ ని మళ్ళీ సెట్ చేస్తుండగా తాజాగా నేడు వచ్చిన మేకింగ్ వీడియోలో అయితే కొన్ని విజువల్స్ ని అభిమానుల ముందుకు తీసుకుని వచ్చారు.

దీంతో ఈసారి కూడా ఈ కామెడీ ట్రాక్ గట్టిగానే వర్కౌట్ అయ్యేలా కనపడుతుంది. మరి శ్రీను వైట్ల అయితే ఆ వింటేజ్ మ్యాజిక్ ని రిపీట్ చేస్తారో లేదో చూడాల్సిందే. ఇక ఈ చిత్రంలో గోపీచంద్ సరసన కావ్య థాపర్ హీరోయిన్ గా నటించగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ ఫుల్ స్వింగ్ లో జరుగుతుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories