మిస్టర్ బచ్చన్‌ సినిమా నుంచి స్పెషల్‌ అప్డేట్‌!

మాస్‌ మహారాజ్‌ రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది ఈగల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు..కానీ ఈ సినిమా అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. తాజాగా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “మిస్టర్ బచ్చన్” ‘నామ్ తో సునా హోగా ‘ అనేది సినిమా ట్యాగ్ లైన్ . ధమాకా, ఈగల్ సినిమాల తర్వాత పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో  రవితేజ మరో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా చేస్తుంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి టైటిల్ పోస్టర్‌ విడుదల చేయగా రవితేజ లెజెండరీ యాక్టర్ అమితాబ్ పోజ్ లో కనిపించి అందరినీ అలరించాడు.ఈ సినిమాలో రవితేజ అమితాబ్ బచ్చన్ ఫ్యాన్ గా నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి అయినట్లు తెలుస్తుంది. ఈ సందర్భంగా దర్శకుడు హరీశ్ శంకర్ ఓ ప్రమోషనల్ వీడియోను సోషల్‌ మీడియాలో విడుదల చేశాడు. ఈ వీడియోలో హరీశ్ వద్దకు రవితేజ హార్డ్ కోర్ అభిమాని ఒకరు వచ్చి ‘మిస్టర్ బచ్చన్ ‘నుంచి ఏదైనా అప్డేట్ ఇవ్వమని అడుగుతాడు.

దీనికి హరీశ్ మాట్లాడుతూ.. షూటింగ్ పూర్తయింది ఇక అప్డేట్ లే మిగిలున్నాయి. అందరిలా కాకుండా మనం సరికొత్తగా ప్లాన్ చేద్దాం. ఈసారి ఒక షో రీల్ వదులుదాం. అందులో డైలాగ్స్ లాంటివి ఏమి ఉండవు అంటూ హరీశ్ శంకర్ చెబుతున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట  వైరల్‌ అవుతుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories