రామాయణంలో సీత..!

బాలీవుడ్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న రామాయణ సినిమాకు ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి ఉంది. ఈ సినిమాలో రణబీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా, యష్ రావణాసురుడిగా కనిపించనున్నారు. సీత పాత్ర కోసం మొదట శ్రీనిధి శెట్టి ఎంపిక అయ్యారని వార్తలు వస్తున్నాయి. అయితే, కేజీయఫ్ సినిమాలో యష్ పక్కన నటించిన తర్వాత, తాజాగా రావణుడిగా ఆయన నటిస్తున్నందున ఆమె అభిమానులు ఇది సరిగ్గా అంగీకరించకపోతారని భావించి ఈ అవకాశాన్ని తిరస్కరించినట్లు సమాచారం.

తాజాగా శ్రీనిధి శెట్టి ఈ విషయంపై స్పందిస్తూ, రామాయణానికి ఆమె కూడా ఆడిషన్ ఇచ్చినప్పటికీ ఎంపిక కాలేదని, ఆ పాత్రకు సాయిపల్లవి పూర్తిగా సరిపోయే అవకాశం ఉందని చెప్పింది.

ప్రస్తుతం శ్రీనిధి శెట్టి స్టార్ బోయ్ సిద్ధు జొన్నలగడ్డ సరసన ‘తెలుసు కదా’ సినిమాలో నటిస్తోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories