జగన్ కోసం కొత్త నక్సలైట్లు పుట్టాలా?

జగన్మోహన్ రెడ్డికి విషయ పరిజ్ఞానం చాలా తక్కువ అని అందరూ అంటూ ఉంటారు. అది ప్రెస్ మీట్ అయినా సరే, బహిరంగ సభ అయినా సరే తన భావజాలానికి అనుగుణంగా ఉండే మేధావులతో రాయించుకువచ్చిన ప్రసంగాలను ఒక్కో వాక్యాన్ని రెండు మూడు సార్లు చూసుకొని గాని మాట్లాడలేని జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు నక్సలిజం గురించి మాట్లాడుతున్నారు. సమాజ సంస్కరణకు ఉపయోగపడాలని భావించే వ్యక్తులు.. ప్రజల కోసం తమ జీవితాలను అర్పించి వ్యవస్థలో లోపాలను చక్కదిద్దడానికి- నక్సలైట్లు అనే వామపక్ష అతివాద భావజాలంతో పోరాడుతూ ఉంటారని సాధారణంగా జనం భావించే సంగతి. అభివృద్ధి వినాశకరంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నప్పుడు వాళ్లు జోక్యం చేసుకుంటారని అందరూ అనుకుంటారు. జగన్మోహన రెడ్డి మాటలను గమనిస్తే ఆయన భూస్వామ్య పెత్తందారీ దురహంకార పోకడలకు రక్షణ కవచం లాగా కొత్త నక్సలైట్లు పుట్టుకు రావాలని ఆయన కోరుకుంటున్నట్టుగా అనిపిస్తున్నది.

జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ‘నా చుట్టూ ఉన్న వారిని కేసుల్లో ఇరికించి జైలుకు పంపాలని తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారు. మా పార్టీలోని అనేక మందిపై తప్పుడు కేసులు పెడుతున్నారు. వారిని వెంటాడుతున్నారు. ఇలాంటి వాటి వల్లే నక్సలిజం పుడుతుంది. రాష్ట్రాన్ని బీహార్ లా మారుస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు. జగన్ చెబుతున్న మాటల్లోనే ఆయన పాలనలో జరిగిన దందాల అసలు గుట్టు బయటపడుతోంది. జగన్ చుట్టూ ఉన్నవారు కేసుల్లో ఇరుక్కుంటున్నారంటే దాని అర్థం జగన్ పాలనలో ఆయన సొంత కోటరీ అనేక అక్రమాలకు పాల్పడిందని ఆయన ఒప్పుకుంటునట్లే లెక్క. చేసిన అరాచకాల మీద కేసులు పెడుతున్నారు తప్ప హత్యలు చేయించడం లేదు కదా.. జగన్ పరిపాలన కాలంలో ఆయన అండ చూసుకొని విచ్చలవిడిగా అరాచకాలు అవినీతికి పాల్పడిన వారు అధికారం దిగిపోయిన తరువాత తమ పాపం పండకుండా ఉంటుందని ఎలా అనుకుంటారు? అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆనుభూతిపరులైన సీనియర్ నాయకులు అవినీతి అరాచకాలుతో నిమిత్తం లేని నాయకుల జోలికి ప్రభుత్వం వెళ్లడం లేదని కూడా జగన్ ఇండైరెక్టుగా ఒప్పుకున్నట్లు అవుతుంది. అవినీతి చరిత్ర పెద్దగా లేని వైసీపీ నాయకులు ఇప్పటి ప్రభుత్వం మీద విరుచుకుపడుతున్నా కూడా వారి మీద ఎలాంటి కేసులూ పెట్టడం లేదని కూడా గమనించాలి.

తన పాలనలో చేసిన అనేక అవినీతి పనులను ఇప్పటి ప్రభుత్వం బయటకు తీస్తున్నందుకు వ్యతిరేకంగా నక్సలైట్లు వస్తారని జగన్మోహన్ రెడ్డి చెప్పడం గమనిస్తే ప్రజలకు భయం కలుగుతోంది. ఆ ముసుగులో కరుడుగట్టిన తమ పార్టీ గూండాలను ఆయుధాలు చేతపట్టిన అరాచకశక్తులుగా తయారుచేయాలనుకుంటున్నారా? అనేది అర్థం కావడం లేదు. అజ్ఞాతంలో ఉంటూ హత్యాకాండలు కొనసాగించే అతివాద దళాలుగా తయారు చేసే స్కెచ్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం చేస్తున్నారేమో అని ప్రజలు భయపడుతున్నారు. ప్రభుత్వ నిఘా వర్గాలు ఈ దిశగా దృష్టి సారించి జాగ్రత్త పడాలని కూడా భావిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories