నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటూ..రాశిఖన్నా వైరల్‌ పోస్ట్‌!

టాలీవుడ్‌ యంగ్‌ బ్యూటీ రాశిఖన్నా తెలుగులో ఊహలు గుసగుసలాడే సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. మొదటి సినిమానే మంచి విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ తరువాత వరుస అవకాశాలు కొట్టేసి బెంగాల్‌ టైగర్‌, సుప్రీమ్‌, శివమ్‌ వంటి హిట్స్‌ తన ఖాతాలో వేసుకుని స్టార్‌ హీరోయిన్‌ గా మారిపోయింది.

కానీ విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ తర్వాత టాలీవుడ్‌కు బై బై చెప్పేసి బాలీవుడ్‌కు చెక్కేసింది. అందుకు కారణం అవకాశాలు రాకపోవడం వల్లేనని అభిమానులు అంటున్నారు. ఈ అమ్మడు వరుస సినిమాలు చేస్తూ ముందుకు దూసుకుపోతుంది. ఇటీవల యోధా సినిమాతో  మరో హిట్ ని తన ఖాతాలో వేసుకుంది.

అంతేకాకుండా ‘అరుణ్మై-4’ వెబ్ సిరీస్‌తో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది.ఈ సిరీస్ కూడా బాగానే రెస్సాన్స్‌ను దక్కించుకుని దూసుకుపోతోంది. అయితే రాశిఖన్నా సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ పలు పోస్టులతో అభిమానులకు టచ్‌లో ఉంటోంది. తాజాగా, ఈ అమ్మడు పెళ్లి కాకుండానే ఓ చిన్న పాపని ఎత్తుకొని ఉన్న ఫొటోలు సోషల్‌ మీడియాలో షేర్ చేసి అందరికీ షాకిచ్చింది. ఇందులో చిన్న పాపను తన ఒడిలో కూర్చోబెట్టుకుని ఫొటోలకు పోజులిచ్చింది.

అంతేకాకుండా ‘‘నా అందమైన మేనకోడలు రాకతో మా కుటుంబం మరింత అందంగా మారిపోయింది. మా లిటిల్ ప్రిన్సెస్… మాటల్లో చెప్పలేనంత ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాను’’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం రాశి ఫొటోలు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతుండగా.. వాటిని చూసిన వారు కొందరు మీలాగే క్యూట్, అండ్ బ్యూటిఫుల్‌గా ఉందని కామెంట్లు పెడుతున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories