ఆమె పై ప్రశంసలు కురిపించన సామ్‌!

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత గత కొద్ది కాలంగా సినిమాలకు , ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. గత కొంత కాలం క్రితం ఆమె మయోసైటీస్‌ వ్యాధి బారిన పడటంతో ఆమె చికిత్స తీసుకుంటూ అభిమానులకు ఎప్పుడూ టచ్‌ లోనే ఉంటుంది. ఇప్పుడిప్పుడే వ్యాధి నుంచి కోలుకోవడంతో తిరిగి సినిమాల్లో నటించేందుకు ఆమె ముందుకు వస్తుంది.

కానీ సినీ ఆఫర్లు రాకపోవడంతో.. యాడ్స్‌ చేస్తూంది.  అయితే  తాజాగా, సమంత ఓ ఇంటర్ విద్యార్థిని పై ప్రశంసలు కురిపించింది. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో  కర్నూల్ జిల్లాకు చెందిన నిర్మల అనే విద్యార్థిని  మంచి మార్కులు సాధించి కాలేజీ టాపర్‌గా నిలిచింది. ఆమె పదో తరగతిలో కూడా ఎక్కువ మార్కులు సాధించి మంచి స్థానంలో నిలిచింది.

అయితే నిర్మల తల్లిదండ్రులు తనకు పెళ్లి చేయాలని చూసినా సరే ఆమెకు చదువుపై ఉన్న ఇష్టంతో ఇంటర్‌లో ఏకంగా 440కి 421 మార్కులు సాధించి అందరిచేత శభాష్‌ అనిపించుకుంది. ఇదే విషయంపై సామ్ సోషల్ మీడియా వేదికగా ఓఆసక్తికర పోస్ట్ పెట్టింది. ఈ రోజుల్లో నిర్మల చాలా మందికి ఆదర్శం అంటూ రాసుకొచ్చింది.

అంతేకాకుండా ఓ ఓ పత్రిక క్లిప్‌ను కూడా తన పోస్ట్‌ కి జత చేసింది. ప్రస్తుతం సామ్ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories