దూసుకుపోతున్న కమిటీ కుర్రాళ్లు!

మెగా డాటర్‌ నిహారిక సమర్పణలో పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్  ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై  తాజాగా రూపొందించిన సినిమా ‘కమిటీ కుర్రోళ్ళు’. ఈ సినిమాకు య‌దు వంశీ డైరెక్టర్ గా వ్యవహరించారు. ఆగస్ట్ 9న విడుదలైన 10 సినిమాలలో ఓన్లీ కమిటీ కుర్రోళ్ళు మాత్రమే హిట్ టాక్ తెచ్చుకుని ముందుకు దూసుకుపోతుంది. ఈ సినిమా డిఫరెంట్ కంటెంట్‌తో ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్‌, అటు యూత్‌ను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమా సోమవారం వర్కింగ్ డే అయినప్పటికీ కూడా కలెక్షన్స్ ఎక్కడా డ్రాప్ అవ్వకుండా అన్నీ ఏరియాస్‌లో సినిమా బ్రేక్ ఈవెన్ సాధించింది.

తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని వంశీ నందిపాటి విడుదల చేశారు. చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా పెద్ద హిట్ సాధించే దిశగా దూసుకుపోతుంది. ప్రస్తుతం ‘కమిటీ కుర్రోళ్ళు’ ఐదు రోజుల్లో రూ. 8.49 కోట్లు కలెక్షన్స్ సాధించిందని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. మంచి ప‌ల్లెటూరి వాతావ‌ర‌ణంలో స్నేహం, ప్రేమ‌, కుటుంబంలోని భావోద్వేగాల‌ను ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రంలో సీనియ‌ర్ న‌టీన‌టుల‌తో పాటు 11 మంది యంగ్‌ హీరోలు, న‌లుగురుయంగ్‌  హీరోయిన్స్‌ను తెలుగు సినిమాకు ప‌రిచ‌యం చేస్తూ మేక‌ర్స్ చేసిన ఈ ప్ర‌య‌త్నాన్ని అభినందిస్తూ ప్రేక్ష‌కులు సినిమాను ఆద‌రించార‌ని ట్రేడ్ వ‌ర్గాలంటున్నాయి.

సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిందని చిత్ర యూనిట్ ఈ సందర్భంగా తెలియజేసింది. ఆగస్టు 15 లాంగ్ వీకెండ్ నేపథ్యంలో కమిటీ కుర్రోళ్ళు మరిన్ని కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉన్నట్లు తెలిపింది. మరోవైపు ఈ చిత్ర నిర్మాత నిహారిక కొణిదెలకు టాలీవుడ్ ప్రముఖ దర్శకులు, హీరోలు అభినందనలు తెలియజేస్తున్నారు. మెగా బ్రదర్ రామ్ చరణ్ నిహారిక ఈ విజ‌యానికి నువ్వు అర్హురాలివి.. నీ టీమ్‌తో క‌లిసి నువ్వు ప‌డ్డ క‌ష్టం, నిబ‌ద్ధ‌త స్ఫూర్తినిస్తున్నాయని అభినందనలు తెలియజేశారు.

Related Posts

Comments

spot_img

Recent Stories