తమిళ హీరో సూర్య నటించిన తాజా సినిమా ‘రెట్రో’ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన ఈ సినిమాపై మంచి అంచనాలు ఉండగా, ఆ అంచనాలను అందుకోవడంలో మాత్రం సినిమా విఫలమయ్యింది. ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో చిత్రం పూర్తిగా వెనుకపడింది. ఫలితంగా, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేకపోయింది.
థియేటర్లలో ఆశించిన విజయం దక్కకపోయినప్పటికీ, ఇప్పుడు మేకర్స్ ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో మే 31 నుంచి స్ట్రీమింగ్ మొదలవుతుందని మొదట ప్రకటించారు. అయితే, తాజాగా తీసుకున్న నిర్ణయంతో స్ట్రీమింగ్ డేట్ను ముందుకు మార్చారు. అందువల్ల, ‘రెట్రో’ మే 30 నుంచే ఓటీటీలో అందుబాటులోకి రానుంది.
మూవీ థియేటర్లలో పెద్దగా రాణించకపోయినా, డిజిటల్ ప్లాట్ఫాంలో మంచి స్పందన వస్తుందనే నమ్మకంతో మేకర్స్ ఈ ముందస్తు రిలీజ్కి వెళ్తున్నారు. థియేటర్లో దక్కని ఆదరణను, నెట్ఫ్లిక్స్ వేదికగా అందుకోవాలని వారు ఆశిస్తున్నారు. ఇప్పుడు చూడాలి ఈ మూవీకి ఓటీటీ వేదిక ఎంత వరకూ అవకాశాన్ని ఇస్తుందో.