చెప్పాపెట్టకుండా తీసేశారు!

పెళ్లి అనంతరం హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌ చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. హిందీ పరిశ్రమలో ఇటీవల దశాబ్దకాలం పూర్తి చేసుకున్న రకుల్.. ప్రస్తుతం బాలీవుడ్‌లో ఎక్కువ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. టాలీవుడ్‌లో అయితే చివరిసారిగా మెగా హీరోతో కలిసి ‘కొండపొలం’ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. తెలుగులో స్టార్ హీరోలతో నటించిన రకుల్ హవా ఇటీవలి కాలంలో తగ్గింది.

బాలీవుడ్‌ సినిమాలతో బిజీగా ఉన్న రకుల్‌.. తాజాగా కొన్ని ఆసక్తికర కామెంట్లు చేశారు. తనను ‘రెబల్ స్టార్’ ప్రభాస్ సినిమా నుంచి చెప్పకుండా తీసేశారని చెప్పి అందర్ని షాక్‌ కి గురి చేసింది. ఓ యూట్యూబ్‌ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రకుల్ మాట్లాడుతూ… ‘కెరీర్ ఆరంభంలో రెబల్ స్టార్ ప్రభాస్ సరసన హీరోయిన్‌గా నటించే అవకాశం వచ్చినట్లు తెలిపింది. సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న సమయం అది. అందుకే నేను చాలా సంతోషించాను.

నాలుగు రోజుల పాటు షూటింగ్‌ కూడా జరిగింది. నా షెడ్యూల్‌ను ముగిసాక ఢిల్లీకి వెళ్లా. ప్రభాస్ సినిమా నుంచి నన్ను తొలగించినట్లు తెలిసింది. కనీసం నాకు సమాచారం కూడా ఇవ్వలేదు. మరో తెలుగు సినిమాలోనూ ఇలాగే జరిగింది. అయితే ఆ సినిమా షూటింగ్ ప్రారంభం కాకముందే తొలగించారు. ఆ తర్వాత నాకు ఇండస్ట్రీపై అవగాహన వచ్చింది. ఇలాంటి వాటిని పెద్దగా పట్టించుకోవద్దని అనుకున్నా’ అని చెప్పుకొచ్చింది. ఆ చిత్రం మరేదో కాదు ‘మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్‌’.

ఈవిషయంపై నిర్మాత దిల్ రాజు కూడా గతంలో క్లారిటీ ఇచ్చారు.2009లో కన్నడ చిత్రం ‘గిల్లీ’తో రకుల్ ప్రీత్ సింగ్‌ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. 2013లో ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’తో తెలుగులోకి వచ్చారు. 2014లో యారియాన్‌తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. బాలీవుడ్‌లో థాంక్ గాడ్, రన్‌వే 34, డాక్టర్ జి, దే దే ప్యార్ దే వంటి అనేక చిత్రాలలో యాక్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.

Related Posts

Comments

spot_img

Recent Stories