పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో వస్తున్న హరి హర వీరమల్లు సినిమా మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా మీద అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం జూన్ 12, 2025న థియేటర్లలోకి గ్రాండ్ గా విడుదలకు రానుంది.
సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో, నిర్మాత ఏ ఎం రత్నం తాజాగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు భరత్ భూషణ్ను కలిసి, ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక షోలు నిర్వహించేందుకు అనుమతులు ఇవ్వాలని అధికారికంగా వినతి పత్రం సమర్పించారు. అలాగే టికెట్ ధరలు స్వల్పంగా పెంచేందుకు కూడా ఛాంబర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అభ్యర్థన పంపించాలనుకున్నారు.
ఈ మొత్తం ప్రక్రియ ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ సూచనలతోనే జరిగినట్లు సమాచారం. అవసరమైన విధివిధానాలు పాటిస్తూ అధికారిక మార్గంలో వినతిని పంపాలని పవన్ స్పష్టంగా చెప్పారు.
ఈ చిత్రానికి జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక బాబీ డియోల్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు, నోరా ఫతేహిలు కూడా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. మ్యూజిక్ విషయంలో కూడా ఈ ప్రాజెక్ట్కు మంచి అట్రాక్షన్ ఉంది. ఆస్కార్ అవార్డు గెలిచిన సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
ఇక ఈ చిత్రంలో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలకు దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించినట్టు సమాచారం. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్పై ఎ దయాకర్ రావు నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు.
ఒట్టి యాక్షన్ కాదు, చారిత్రక నేపథ్యం కలగలిసిన ఈ సినిమాపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. పవన్ కళ్యాణ్ అభిమానులకు ఈ సినిమా మరో ఫెస్టివల్లా మారబోతోంది.