మహిళలకు భరోసా.. అసభ్యపోస్టులకు ఖబడ్దార్!

సోషల్ మీడియా అనే ముసుగులో.. భావప్రకటన స్వేచ్ఛ అనే ముసుగులో.. తప్పుడు వ్యాఖ్యానాలు చేయడం.. మహిళల పట్ల కూడా అసభ్య పదజాలంతో దుర్మార్గపు పోస్టులు పెట్టడం అనేది ఇవాళ్టి రోజుల్లో చాలా సర్వసాధారణ విషయంగా మారిపోయింది. రాజకీయ పార్టీలు సోషల్ మీడియా కార్యకర్తలు అనే పేరుతో కొన్ని ముఠాలను పెంచి పోషిస్తూ.. ప్రభుత్వం మీద విమర్శలు, నిందలు వ్యాప్తి చేయించడానికి మాత్రమే కాదు. అధికార పార్టీకి చెందిన నాయకుల కుటుంబాల్లోని మహిళల మీద, మహిళా నాయకురాళ్ల మీద అసభ్యపదజాలంతో నీచమైన పోస్టులు పెట్టడానికి కూడా వాడుతూ ఉంటారు. అయితే అలాంటి తప్పుడు, అసభ్య పోస్టులు పెట్టేవారికి మహిళా కమిషన్ ఇక మీదట సింహస్వప్నంగా మారుతుందని రాయపాటి శైలజ ఇప్పుడు హెచ్చరిస్తున్నారు.
రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్మన్ గా రాయపాటి శైలజ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె గత ప్రభుత్వ హయాంలో మహిళలు వైసీపీ సోషల్ మీడియా ముఠాల కారణంగా ఎన్నెన్ని అకృత్యాలకు  గురయ్యారో స్వయంగా రాయపాటి శైలజకు తెలుసు. అమరావతి ఉద్యమంలో కీలకంగా పాలుపంచుకున్న పోరాట యోధురాలిగా రాయపాటి శైలజ కూడా ఇలాంటి తప్పుడు పోస్టులను ఎదుర్కొన్నారు. తమ మీద అలాంటి పోస్టులను ప్రోత్సహించిన ప్రభుత్వం దుర్మార్గాన్ని అనుభవించారు. అందుకే ఆమె ఇప్పుడు రాష్ట్రంలోని ప్రతి మహిళకు ఆ దిశగా భరోసా కల్పిస్తున్నారు.

రాష్ట్రంలో మహిళలకు ఏ ఇబ్బంది కలిగినా, ఎక్కడ అన్యాయం జరుగుతుందని అనుకున్నా.. నేరుగా వచ్చి మహిళా కమిషన్ ను సంప్రదించవచ్చునని ఆమె అంటున్నారు. వారి హక్కులను కాపాడేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని హామీ ఇస్తున్నారు.

ఈ దిశగా గత అయిదేళ్ల జగన్ సర్కారు కాలంలో మహిళలకు ఎలాంటి అన్యాయం జరిగిందో అందరికీ తెలుసు. ఇప్పటి హోం మంత్రి వంగలపూడి అనిత కూడా గతంలో సోషల్ మీడియా అసభ్య పోస్టుల బాధితురాలే. అప్పట్లో వాసిరెడ్డి పద్మ సారథ్యంలో నడిచిన మహిళా కమిషన్ కేవలం ఉత్సవ విగ్రహంలాగా మాత్రమే ఉండేది. ఎంత దారుణంగా ఆ కమిషన్ పనిచేసిందంటే.. అప్పట్లో తమకు ఏ పనీచేసే స్వేచ్ఛ కూడా లేకుండా పోయిందని నిరసన వ్యక్తం చేసి.. ఎన్నికల తర్వాత వాసిరెడ్డి పద్మ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కే రాజీనామా చేసి బయటకు వచ్చారు. ఈ విషయంలో ఇప్పుడు రాయపాటి శైలజ ఇస్తున్న హామీ మెరుగైనది.

అలాగే, రాష్ట్రంలో ప్రతి జిల్లాలోనూ ఒక ప్రీమారిటల్ కమ్యూనికేషన్ సెంటర్ ను కూడా ప్రారంభించబోతున్నట్టు రాయపాటి శైలజ ప్రకటించారు. దీనికి సంబంధించిన ఫైలుమీదనే ఆమె తొలి సంతకం చేశారు. ఇవాళ్టి రోజుల్లో అలాంటి సెంటర్ల అవసరం చాలా ఉందని, ఇది మంచి ప్రయత్నం అని కూడా ప్రజలు కొనియాడుతున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories