గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న సాలిడ్ మాస్ చిత్రం “పెద్ది” కోసం అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా నుంచి ఇటీవల వచ్చిన ఫస్ట్ గ్లింప్స్ తో మరింత లెవెల్లోకి వెళ్లాయి.
ఇక ఈ చిత్రం షూటింగ్ ని మేకర్స్ శరవేగంగా పూర్తి చేస్తుండగా ఈ సినిమా ఒక రూరల్ మాస్ స్పోర్ట్స్ డ్రామాగా తీర్చిదిద్దుతున్నారు. మరి విజువల్స్ చూసి మరో రంగస్థలం అయ్యే రేంజ్ లో ఈ చిత్రం కనిపిస్తుంది అని టాక్ వినపడుతుంది. అయితే పెద్ది మరింత లెవెల్లో రీచ్ అయ్యేలా ఉందని ఇప్పుడు చెప్పాలి.
లేటెస్ట్ గా ఓ షెడ్యూల్ లండన్ లో కూడా ఉందని ఇపుడు వినిపిస్తుంది. అంటే పెద్ది మ్యానియా సినిమాలో కేవలం లోకల్ నుంచే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో పాకి ఉంటుంది అని చెప్పొచ్చు. అలాగే సినిమాలో ఇలాంటి మూమెంట్స్ డెఫినెట్ గా ఆడియెన్స్ కి మంచి హై ని అందిస్తాయి.