కన్నప్ప చూసిన రజనీ..ఏమన్నారంటే..!

డైనమిక్ హీరో విష్ణు మంచు తన కలల ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ ప్రమోషన్స్‌తో ప్రస్తుతం బిజీగా ఉన్నారు. ఈ సినిమా జూన్ 27న విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే తాజాగా ఓ స్పెషల్ అప్‌డేట్‌తో విష్ణు సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌కి సర్ప్రైజ్ ఇచ్చారు. ప్రముఖ నటుడు రజనీకాంత్ ‘కన్నప్ప’ మూవీని ముందుగా వీక్షించారు. ఇది తెలిసిన వెంటనే అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.

విష్ణు మంచు తన సోషల్ మీడియా వేదికగా రజనీకాంత్‌తో కలిసి దిగిన కొన్ని ఫోటోలు షేర్ చేశారు. అంతేకాదు, రజనీ మూవీ చూసిన తర్వాత తనపై చూపిన ప్రేమాభిమానాలను గురించి కూడా వివరించారు. ఆయన స్పందన తనకు ఎంతో ప్రత్యేకంగా అనిపించిందని పేర్కొన్నారు. రజనీ ఈ సినిమాని చూసిన తర్వాత తనను స్నేహంగా ఆలింగనం చేసుకుని సినిమా చాలా బాగా చేసావని అభినందించారని విష్ణు తెలిపారు. తన కెరీర్‌లో ఇలాంటి మూమెంట్ కోసం చాలా సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నానని, రజనీ వంటి లెజెండరీ నటుడి నుంచి ప్రశంసలు అందుకోవడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు.

ఈ భారీ ప్రాజెక్ట్‌లో భారతీయ సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు స్టార్ నటులు కనిపించనున్నారు. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ వంటి స్టార్ క్యాస్టింగ్‌కి తోడుగా మోహన్ బాబు, కాజల్ అగర్వాల్, శరత్ కుమార్, మధుబాల, ముఖేష్ రిషి, యోగి బాబు, బ్రహ్మానందం, సప్తగిరి, రఘుబాబు, ఐశ్వర్య రాజేష్ వంటి ప్రముఖులు ఇందులో నటిస్తున్నారు. విష్ణు కుమార్తెలు అవ్రామ్, అర్పిత్ రంకా కూడా ఇందులో కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఒకేసారి రిలీజ్ కానుంది. ఈ చిత్రాన్ని మంచు మోహన్ బాబు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మన పౌరాణిక కథల ఆధారంగా రూపొందుతున్న ఈ విజువల్ గ్రాండియర్ చిత్రంపై ఇప్పటికే మంచి బజ్ నెలకొంది. జూన్ 27న థియేటర్లలోకి అడుగుపెట్టబోతున్న ఈ చిత్రం ఎలా ఉండబోతుందో చూడాలి.

Related Posts

Comments

spot_img

Recent Stories