రాజేంద్ర ప్రసాద్‌ వారసురాలి సినిమా వచ్చేస్తుందోచ్‌!

నటకిరీటీ రాజేంద్ర ప్రసాద్‌ గురించి సినీ ప్రపంచానికి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. నటుడిగా, కమెడియన్‌ గా ఎన్నోవందల సినిమాల్లో నటించి మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు. ఆయన ఓ పాత్ర ఒప్పుకున్నాడంటే అందులో జీవిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన తర్వాత ఆయన సంతానం ఎవరూ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వలేదు.

కానీ తర్వాత తరం ఆయన మనుమరాలు తెరంగేట్రం చేస్తోంది. శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ -శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ఎర్రచీర – The Beginning. ఇప్పటికే చిత్ర పోస్ట్ ప్రొడక్షన్, గ్రాఫిక్స్ పూర్తిచేసుకొని విడుదలకు రెడీ అవుతుంది. ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణ నటుడు రాజేంద్రప్రసాద్ గారి ముద్దుల మనవరాలు బేబీ సాయి తేజస్విని. ఈ సినిమాలో 45 నిమషాలు కళ్ళు చెదిరే గ్రాఫిక్స్ పార్ట్ అద్భుతంగా ఉంటుందని డైరెక్టర్‌ సుమన్‌ చెప్పారు.

ఈ సినిమాలో సుమన్ బాబు కూడా  ఒక ముఖ్య పాత్ర లో నటించారు.  సినిమాను మథర్ సెంటిమెంట్, హార్రర్, యాక్షన్ తో రూపొందించినట్లు నిర్మాత ఎన్. వి.వి. సుబ్బారెడ్డి పేర్కొన్నారు. బేబీ సాయి తేజస్విని నటన సరికొత్తగా ఉంటుందని, క్లైమాక్స్ లో ఉన్న మదర్ సెంటిమెంట్ అందరికీ కన్నీరు తెపిస్తుందని, కారుణ్య చౌదరి ఈ సినిమాలో సరికొత్తగా కనిపించబోతుంది అని దర్శకుడు సుమన్ బాబు అన్నారు. శ్రీరామ్, కమల్ కామరాజు, కారుణ్య చౌదరి, అయ్యప్ప పీ శర్మ , సురేష్ కొండేటి, రఘుబాబు, మొదలుగు వారు ప్రధాన పాత్రదారులుగా ఈ సినిమాలో యాక్ట్‌ చేశారు.

Related Posts

Comments

spot_img

Recent Stories