ముగ్గురు భామలతో ఆడిపాడనున్న రాజాసాబ్!

యంగ్‌ రెబల్‌ స్టార్‌  ప్రభాస్‌ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇంకా ఒప్పుకున్న సినిమాలు షూటింగ్‌ పూర్తి కాకముందే మరికొన్ని సినిమాలను లైన్‌ లో పెడుతున్నాడు. గతేడాది సలార్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకున్న యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రస్తుతం నాగ్ అశ్విన్‌ డైరెక్షన్‌ లో కల్కి 2898 ఏడీ అనే సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా జూన్‌ 27న థియేటర్లలోకి రానుంది. ఇదిలా ఉండగానే మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌ అయిన కన్నప్ప సినిమాలో కూడా ప్రభాస్‌ కీలక పాత్ర చేస్తున్నాడు. ప్రస్తుతం కన్నప్ప సినిమా  షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అతి త్వరలోనే ఈమూవీ షూటింగ్ లో ప్రభాస్ జాయిన్ కానున్నాడు . ఇదిలా ఉంటే ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “ది రాజాసాబ్”. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ మారుతీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దర్శకుడు మారుతీ ఈ సినిమాను తనదైన శైలిలో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా కామెడీ హారర్ మూవీగా తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే  ఈ మూవీ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెగ వైరల్ అవుతుంది.

ఈ సినిమాలో ప్రభాస్ ఓ స్పెషల్ సాంగ్ లో నటించబోతున్నట్లు సమాచారం. ఈ పాటలో ప్రభాస్ ఏకంగా ముగ్గురు భామలతో ఆడిపాడనున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్‌, రిద్ది కుమార్‌, మాళవిక మోహనన్‌ హీరోయిన్స్ గా చేస్తున్నారు.. ఈ ముగ్గురూ ఒకే పాటలో ప్రభాస్‌తో స్టెప్పులేయనున్నట్లు సమాచారం. ఫ్యాన్స్ తో విజిల్స్ వేయించే డాన్స్‌ మూమెంట్స్‌తో ఈ పాట ఉండనుందని సమాచారం. హరర్ కామెడీ జోనర్ లో ప్రభాస్‌ చేస్తున్న తొలి మూవీ కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు వున్నాయి . ‘

Related Posts

Comments

spot_img

Recent Stories