పుష్ప 2 నుంచి అదిరిపోయే పిక్‌ వచ్చింది!

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా సీక్వెల్ సినిమా ‘పుష్ప-2’ కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకించి చెప్పానవసరం లేదు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ఈ క్రేజీ సీక్వెల్ సినిమాన్ని క్రియేటివ్ జీనియస్ సుకుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే మెజారిటీ షూటింగ్ ముగించుకున్న ఈ సినిమాను వీలైనంత త్వరగా ముగించేందుకు మూవీ మేకర్స్ ప్రయత్నిస్తున్నారు.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ముగించుకుంటున్న ‘పుష్ప-2’ సెట్స్ నుండి దర్శకుడు సుకుమార్ ఓ అదిరిపోయే చిత్రాన్ని వదిలాడు. ‘పుష్ప-2’ సెట్స్‌లో ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా, స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్.రాజమౌళి వెళ్లి చిత్ర బృందంతో కలిసి సందడి చేశాడు. దీంతో ‘పుష్ప-2’ చిత్ర టీమ్ సంతోషంతో ఉప్పొంగిపోయారు.

దీంతో సుకుమార్ అండ్ టీమ్ రాజమౌళితో ఓ ఫోటో దిగి దానిని సోషల్ మీడియాలో పెట్టారు. ఇలా బిగ్గెస్ట్ మాస్ ఫిల్మ్ ఆఫ్ ఇండియన్ సినిమా ‘పుష్ప-2’ సెట్స్‌లో బిగ్గెస్ట్ స్టార్ డైరెక్టర్ సందడి చేయడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఇక ‘పుష్ప-2’ చిత్రాన్ని డిసెంబర్ 6న గ్రాండ్ గా విడుదల మూవీ మేకర్స్ సిద్ధమవుతున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories