విజయేంద్ర ప్రసాద్‌ తో పూరి!

టాలీవుడ్‌లో పాన్ ఇండియా, పాన్ వరల్డ్ స్థాయిలో సంచలన విజయాలు సాధించిన దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి పేరు అందరికీ తెలుసు. ఈ విజయాల వెనుక అతనికి బలమైన కథలు ఇచ్చే వ్యక్తి ఎవరు అంటే అది అతని తండ్రి విజయేంద్ర ప్రసాద్ అని కూడా అందరికి తెలిసిన విషయం. విజయేంద్ర ప్రసాద్ రాసిన కథలే రాజమౌళి సినిమాలకు ప్రాణం అని చెప్పొచ్చు.

కానీ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, విజయేంద్ర ప్రసాద్ ఒకేసారి తన కొడుకు వర్క్‌ని మాత్రమే కాకుండా, మరో డైరెక్టర్ వర్క్‌కి కూడా ఫ్యాన్ అని ఎప్పటికప్పుడు చెబుతారు. ఆ డైరెక్టర్ ఎవరు అంటే పూరి జగన్నాథ్. పూరి జగన్నాథ్ సినిమాలంటే విజయేంద్ర ప్రసాద్‌కు ప్రత్యేకంగా ఇష్టం అని ఆయన అనేక సందర్భాల్లో వెల్లడించారు.

ఇప్పుడు తాజాగా పూరి జగన్నాథ్, విజయేంద్ర ప్రసాద్ కలిసి తీసిన ఫొటో ఒకటి బయటకు వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫొటోలో నిర్మాత, నటి అయిన ఛార్మి కూడా ఉన్నారు. ఈ ముగ్గురు ఒకచోట కూర్చుని ఉండటం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.

ఎందుకంటే ఈ ముగ్గురు ఇలా కలవడం వెనుక ఏదో కొత్త ప్రాజెక్ట్ ప్రణాళిక ఉందేమో అనే చర్చ మొదలైంది. పూరి జగన్నాథ్, ఛార్మి, విజయేంద్ర ప్రసాద్ కాంబినేషన్‌లో ఏదైనా క్రేజీ ప్రాజెక్ట్ రాబోతోందా? అన్న ఉత్సుకత ఫ్యాన్స్‌లో మొదలైపోయింది. త్వరలోనే వీరి కలయిక వెనుక నిజమైన కారణం బయటకు వచ్చే అవకాశం ఉంది. దీని మీద సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories