ప్రభాస్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా ‘ది రాజాసాబ్’ ప్రస్తుతం సినిమా ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో క్యూరియాసిటీ పెంచింది. మారుతి దర్శకత్వంలో వస్తున్న ఈ హారర్ కామెడీ ఎంటర్టైనర్కి సంబంధించి ఇప్పటికే వచ్చిన టీజర్ మంచి రెస్పాన్స్ అందుకుంది. దీంతో ఈ సినిమా మీద అంచనాలు మరింత పెరిగిపోయాయి.
ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ చివరి దశకి చేరుకుంది. చివరి షెడ్యూల్ను ప్రత్యేకంగా తయారు చేసిన ప్యాలెస్ సెట్లో ప్లాన్ చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా క్లైమాక్స్ పార్ట్ను చిత్రీకరించేందుకు టీమ్ సిద్ధమవుతోందట. జూలై మొదటి వారం నుంచే ఈ పార్ట్ షూటింగ్ స్టార్ట్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.
ఈ సినిమాలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ నటిస్తున్నారు. సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టి.జి. విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సినిమా ప్రభాస్కి ఓ మాస్ అండ్ ఫన్ ఎలిమెంట్స్ ఉన్న ఛాయలో కొత్త ఇమేజ్ ఇవ్వబోతుందనే టాక్ టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. కథ, కామెడీ, హారర్ మిక్స్తో రూపొందుతున్న ఈ సినిమా అభిమానులను బాగా ఆకట్టుకునేలా ఉండబోతోంది.