సుప్రీం కోర్టుకు చేరిన పంచాయతీ!

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ నటించిన ‘థగ్ లైఫ్’ అనే సినిమా ఈ నెల 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. దర్శక దిగ్గజం మణిరత్నం తెరకెక్కించిన సినిమా కావడంతో మొదటి నుంచి ఈ ప్రాజెక్ట్ మీద భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసిన ఈ సినిమాపై అభిమానుల్లోనూ, సినీ వర్గాల్లోనూ మంచి బజ్ కనిపించింది.

అయితే విడుదలకు ముందే ఈ సినిమాకు కర్ణాటకలో అడ్డంకులు ఏర్పడాయి. కమల్ హాసన్ ఓ ప్రమోషన్ ఈవెంట్‌లో మాట్లాడుతూ కన్నడ భాషపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆయన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ తీవ్రంగా స్పందించింది. ఆయన తప్పుకి క్షమాపణ చెప్పాల్సిందేనంటూ డిమాండ్ చేసింది. దీంతో ఈ వివాదం కాస్త హైకోర్టు వరకు వెళ్లింది. అక్కడ కూడా కమల్ క్షమాపణ చెప్పాలని స్పష్టం చేస్తూ తీర్పు వచ్చింది.

ఈ పరిణామాల మధ్య సినిమా విడుదలైనా, కర్ణాటక రాష్ట్రంలో మాత్రం అధికారికంగా నిషేధం అమలులో ఉంది. దీనిపై దర్శకనిర్మాతలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, తాజా సమాచారం ప్రకారం ఈ వ్యవహారంపై జూన్ 14న కోర్టులో విచారణ జరగనుంది. సినిమా విడుదలపై అధికారికంగా ఎలాంటి ఆంక్షలూ లేకుండానే నిషేధం విధించారని పిటిషన్‌లో పేర్కొనడంతో, సుప్రీం కోర్టు కర్ణాటక ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూన్ 17కి వాయిదా వేసింది.

ఇక సినిమాకి మిగతా భాషల్లో విడుదలై కొన్ని రోజులు గడిచినప్పటికీ, ప్రేక్షకుల స్పందన ఆశించిన స్థాయిలో రాలేదు. బిగ్ డైరెక్టర్ – స్టార్ హీరో కాంబినేషన్‌లో వచ్చినప్పటికీ, ప్రేక్షకుల అభిప్రాయాల ప్రకారం సినిమా బాగోలేదన్న ఫీడ్‌బ్యాక్ ఎక్కువగా వినిపిస్తోంది. ఒకవేళ ఈ వివాదం లేకపోయినా, సినిమా కంటెంట్ పరంగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయినట్టు తెలుస్తోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories