తారక్‌ కి మాత్రమే సాధ్యం!

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ.ఎన్టీఆర్ ప్రస్తుతం జపాన్‌లో ‘దేవర’ చిత్ర ప్రమోషన్స్ చేస్తూ ఫుల్‌ బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఆయన ఆ దేశంలో ‘దేవర’ చిత్రాన్ని ఏ రేంజ్‌లో ప్రమోట్ చేస్తున్నాడో మనం చూశాం. ఇక ఆయనతో పాటు దర్శకుడు కొరటాల శివ కూడా ఈ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. అయితే, ఈ క్రమంలో కొరటాల శివ ఓ ఎవర్‌గ్రీన్ క్లాసిక్ రీమేక్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

ఓ ఇంటర్వ్యూలో భాగంగా.. సౌత్ ఇండియాలో కె.విశ్వనాథ్ అనే లెజెండరీ డైరెక్టర్ ఉండేవారు. ఆయన ‘సాగర సంగమం’ అనే సినిమాను తెరకెక్కించారు. అది ఎవర్‌గ్రీన్ క్లాసిక్‌గా ఉండిపోయిందని.. అందులో కమల్ హాసన్ నటించారని.. ఆ సినిమా అంటే ఈ జనరేషన్ డైరెక్టర్స్‌కి ఎంతో ఇష్టమని డైరెక్టర్‌ శివ చెప్పుకొచ్చారు. ఇక ఆ చిత్రాన్ని ఇప్పుడున్న డైరెక్టర్స్ ఎవరైనా రీమేక్ చేస్తే, కేవలం ఎన్టీఆర్ మాత్రమే వారికి ఛాయిస్ అని కొరటాల కామెంట్ చేశాడు.

దీంతో ‘సాగర సంగమం’ చిత్రాన్ని నిజంగానే రీమేక్ చేస్తే, ఎన్టీఆర్ మాత్రమే ఈ సినిమాకు పూర్తి న్యాయం చేయగలడని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఇక కొరటాల చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.  

Related Posts

Comments

spot_img

Recent Stories