ఇప్పుడేగా ఒకటి విడుదలైంది..అంతలోనే మరోకటా?

టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ హీరోలలో సాలిడ్ పర్సనాలిటీ కలిగిన యువ హీరో అశ్విన్ బాబు ఒకరని చెప్పుకొవచ్చు. ఆయన నటించిన తాజా సినిమా “శివం భజే” గురువారం థియేటర్లలోకి వచ్చిన సంగతి తెలిసిందే. డిఫరెంట్ సబ్జెక్టులతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ యంగ్ టాలెంటెడ్ హీరో, మరో ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్‌తో త్వరలోనే మనముందుకు రాబోతున్నడని సమాచారం.

మెడికో థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మామిడాల ఎం.ఆర్.కృష్ణ డైరెక్షన్‌ బాధ్యతలు చేపట్టారు. ప్రముఖ నిర్మాణ సంస్థ అరుణశ్రీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్ నెంబర్-3 గా రూపొందుతున్న ఈ సినిమాని నిర్మాత టి.గణపతి రెడ్డి భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు.

ఆగస్టు 1  అశ్విన్ బాబు పుట్టిన రోజు సందర్భంగా, చిత్ర యూనిట్ అశ్విన్ బాబుకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచింది. ఈ సినిమాలో అశ్విన్ బాబుకి జోడిగా రియా సుమన్ నటిస్తుండగా అయేషా ఖాన్, మురళీ శర్మ, సచిన్ ఖేడేకర్, అజయ్, వీటివి గణేష్, యెష్నా చౌదరి, సుదర్శన్, షకలక శంకర్, రాఘవ ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నట్లు చిత్ర బృందం తెలిపింది.

Related Posts

Comments

spot_img

Recent Stories